- ఏపీని దేశానికే ఆదర్శంగా నిలపడమే ఆశయం
- ఇతర ప్రాంతాల్లో విద్యార్థులకు నేరుగా పెన్షన్
- అర్హత కలిగిన ఏ ఒక్కరి పెన్షన్ను తొలగించం
- కేంద్ర సహకారంతో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు
- వయోవృద్ధులకు త్వరలో డిజిటల్ కార్డులు ఇస్తాం
- వారిపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడి
అమరావతి(చైతన్యరథం): వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని సాం ఘిక సంక్షేమ, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2వ సమావేశం, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ అన్డిజేబులిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రత పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ, విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ధృవపత్రాల జారీ, ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాల (పీఎండీకేలు) స్థాపన, ఉపకర ణాల సరఫరా. వివిధ అభివృద్ధి పథకాలు/కార్యక్రమాలలో 5 శాతం రిజర్వేషన్ల అమ లు, వసతిగృహాలు, కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థు లకు డీబీటీ మోడ్లో పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిం చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇంటికి దూరంగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో వసతిగృహాలు, కళాశాలల్లో చదువుతున్న ఆ కేటగిరీ విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే పెన్షన్ జమచేస్తామని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందించడమే లక్ష్యంగా వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ను తొలగించేది లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో 5 ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వీటిని విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయా లని ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ప్రతిఒక్కరికి ఆధార్ కార్డు అందేలా అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం మొదట్లోనే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఆటిజం విద్యార్థులు, తల్లి దండ్రులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. కేంద్ర సహకా రంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నామని, అన్ని జిల్లాల్లోనూ ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వయోవృద్ధుల హక్కులపై వారికి అవగాహన కల్పించటంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఒం టరిగా నివాసం ఉంటున్న వయోవృద్ధుల వివరాలు పోలీసు శాఖ సేకరించి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. వయోవృద్ధులకు డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడిరచారు. వారిపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్య లు తప్పవని, వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆస్తుల సంకరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.