చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతు పాదయాత్ర .. వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర చంద్రబాబు వెల్లడి

by చైతన్యరధం
May 13, 2023 at 9:30am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
chandrababu

chandrababu Speaking at the Rythu Porubata Sabha in Tanuku

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వారంరోజులు గడువుతో తాజా అల్టిమేటం
వైసీపీ ఇవ్వకుంటే టిడిపి వచ్చాక రైతులకు పరిహారం చెల్లింపు
ఈ సిఎం కు పాలించే అర్హత వుందా?
నాతో కలసి పోరాటానికి రైతులు సిద్ధంగా వుండాలి
5 కోట్లమంది ప్రజలకు, సైకో మధ్యనే యుద్ధం
ఆకు రౌడీలకు భయపడతానా?
తణుకు రైతు పోరుబాట సభలో చంద్రబాబు ధ్వజం
…..
రైతులు తలపెట్టిన పాదయాత్ర వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుంది అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అకాలవర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం నుంచి తణుకు పట్టణం వరకు చంద్రబాబు రైతులతో కలసి పాదయాత్ర నిర్వహించారు. 14 కిలోమీటర్ల పొడవునా సాగిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అనంతరం తణుకు పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

రైతులకు న్యాయం చేయకపోతే ఈ ముఖ్యమంత్రిని నిలదీద్దాం. అవసరం అయితే తాడేపల్లి వెళదాం అని పిలుపునిచ్చారు. రైతుల తరుపున నేను చేసిన నాలుగు డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలి. వారం రోజుల్లో ప్రభుత్వం మాడిమాండ్లు తీర్చాలి. లేదంటే అప్పుడు తదుపరి పోరాటం చేస్తాం అని వెల్లడించారు. దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, వరికి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి. హార్టికల్చర్ పంటలకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి. ఇన్షూరెన్స్ కట్టలేదు కాబట్టి, నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి.

సంబంధితవార్తలు

యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం | Chandrababu Naidu | TDP

ఏపీపీఎస్సీలో అక్రమాలఫై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశం. #APPSCscamExposed

‘కలలకు రెక్కలు’ పథకంలో భాగంగా విద్యార్థినుల రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు గారు.

ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు మనం పోరాడుదాం. ప్రభుత్వం అప్పటికీ ఇవ్వకపోతే. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో పెద్దఎత్తున ఆక్వాకల్చర్ ఉంది. రాయలసీమలో హార్టికల్చర్, ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాను. నాడు ఆక్వా కు యూనిట్ విద్యుత్ రెండు రూపాయలకు ఇచ్చే వాళ్లం. కానీ ఇతను వచ్చి రూ. 1.50 కు యూనిట్ విద్యుత్ ఇస్తాను అని చెప్పారు. ఇవ్వలేదు. రకరకాల నిబంధనలు పెట్టాడు. మనం వచ్చిన తరువాత ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్ అనే నిబంధనలు లేకుండా అందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇద్దామని చంద్రబాబు చెప్పారు.

ఇప్పుడు చుక్కల భూములు అంటున్నాడు. సర్వే అంటున్నాడు. ఈ విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది రైతులు నేడు పాదయాత్ర చేశారు. ఇరగవరం నుంచి తణుకు వరకు జరిగిన పాదయాత్ర చూసి అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యత, సంక్షోభం వచ్చినప్పుడు స్పందిచేవాడే నాయకుడు అన్నారు.

ఇంత వరకు ఎప్పుడూ జరగని నష్టం ఈ సారి అకాల వర్షాల కారణంగా జరిగింది. రైతులకు ఇంత నష్టం జరిగితే మొదట రావాల్సిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి కాదా? మొద్దు నిద్రపోయే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలనే మూడురోజులపాటు పర్యటించాను. పంట మునిగింది పరిహారం ఇవ్వండి అని అడిగాం. ఇదేమన్నా గొంతెమ్మ కోరికా? ఈ రోజు రైతు సంక్షోభానికి, కన్నీళ్లకు కారణం ఎవరు? ఈ సైకో జగన్ కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు చైతన్యవంతులై జగన్ పాలనపై తిరుగుబాటు చేయాలి. ప్రభుత్వం మెడలు వంచి న్యాయం పొందాలి. మొన్న కరోనా వస్తే, అన్ని కంపెనీలు మూసేశారు. కానీ పనిచేసింది ఒక్క రైతులు మాత్రమే.

కరోనా సమయంలో రైతులు పంటలు పండించకపోతే ఈ సిఎం ఏమి తినేవాడు, వైసీపీ మంత్రులు ఏమి తినేవారు? దేశానికి అన్నం పెట్టే రైతుల కంట్లో జగన్ సున్నం కొడుతున్నారు అని విమర్శించారు. రైతుల సమస్యల పట్ల స్పందించలేని వ్యక్తికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రైతుల కష్టాలపై 72 గంటల డెడ్ లైన్ ఇచ్చాము, ధాన్యం కొనకపోతే కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి కొంపకు పంపుతాను అని చెప్పాను. మూడు రోజుల పాటు అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాను. రైతుల కష్టాలు తెలుసుకున్నాను. ఏప్రిల్ 1 వ తేదీన ప్రారంభించాల్సిన ధాన్యం కొనుగోలు ఎందుకు ప్రారంభం కాలేదు అని ధ్వజమెత్తారు. గోనె సంచులు ఇవ్వలేదు. అకాల వర్షాలపై కనీసం రైతులను హెచ్చరించలేదు.

వర్షాల సమయంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. నేను మీ జిల్లాల్లో పర్యటనకు రాకపోతే మీకు కనీసం గోనె సంచులు కూడా ఇచ్చేవారు కాదు. రైతులకు సరైన గోనె సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. గోనె సంచుల సరఫరాలో కూడా లంచాలు మెక్కి, రంధ్రాలు పడ్డ గోనె సంచులిచ్చి రైతలు జేబులకు రంద్రాలు పెట్టారు అని విమర్శించారు. మనం డెడ్ లైన్ ఇచ్చినట్లు 72 గంటలు దాటినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ నాపై మాటలతో దాడి చేస్తున్నారు. చివరికి రైతులను బెదిరించి నేను వెళ్లే మార్గంలో ధాన్యం లేకుండా చేస్తున్నారు. సొంత బాబాయిని చంపిన నేరస్తులకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే. ఒక్కో రైతుపై సరాసరి 2.74 లక్షల అప్పు ఉందని చెప్పారు. ధాన్యం లో తేమ ఉన్నా, మొలక వచ్చినా కొంటాము అని ప్రకటన ఇచ్చారు. ఆ ధాన్యం కొన్నారా అని నేను అడుగుతున్నా. మనం పంట అమ్మితే మనకు డబ్బులు ఇవ్వాలి. కానీ విచిత్రమైన పరిస్థితి మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఆర్బికె ల వల్ల రైతులకు ఏం లాభం వచ్చిందో చెప్పాలి. ఆర్ బికె కేంద్రాలు దగా కేంద్రాలు అయ్యాయి అని ఆరోపించారు.

ఈ ప్రశ్నలకు జవాబు వున్నదా?

అకాల వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు? విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి సాయం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఈ అకాల వర్షాలకు ఎందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోలేదు? ఏప్రిల్ 1 వ తేదీన రబీ ధాన్యం సేకరించాలి. కానీ ఎందుకు ధాన్యం సేకరణ చేపట్ట లేదు.? గోతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది మీ చేతకానితనం కాదా? అని చంద్రబాబు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు. రైస్ మిల్లర్లను దళారులుగా మార్చారు, వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.

కేజీ చక్కెర కొంటే కేజీనే ఇస్తారు. కానీ ఇక్కడ ధాన్యం సంచికి 40 కేజీలకు 42 కేజీలు ఎందుకు తీసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తేమ, తరుగు, నూక పేరుతో అదనంగా డబ్బులు గుంజుతున్నారు. దీని వల్ల బస్తాకు రూ. 200 నుంచి రూ. 300 పోతుంది. అంటే ఎకరానికి 10 వేల నుంచి 20 వేల నష్టం వస్తుంది. ప్రభుత్వం నాపై దాడి చేయడం కాదు. దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. చేతనైనే నాతో పోటీపడి రైతులకు సాయం చేయాలి కానీ నాపై విమర్శలు కాదు అని పేర్కొన్నారు. రైతుల పంటలకు బీమా అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రభుత్వం బీమా కట్టడం లేదు. ఈ ముఖ్యమంత్రి లేచింది మొదలు చెప్పేది అసత్యాలే. ఈ సిఎం కళ్లార్పకుండా అబద్దాలు చెపుతాడు. ఒక్క బాబాయికేసులోనే ఎన్ని అబద్దాలు చెప్పాడో చూశాం.

ఈ సమావేశం ద్వారా అడుగుతున్నా రబీకి ఇన్ స్యూరెన్స్ కట్టారా? ఏ పొలంలో అయినా క్రాప్ కటింగ్ ఎక్సపరిమెంట్ జరిగిందా? అని ప్రశ్నించారు. నాడు నష్టపరిహారం, ఇన్ స్యూరెన్స్ ఇచ్చి కష్ట సమయంలో రైతులను ఆదుకునే వాళ్లం. ప్రభుత్వం ధాన్యం సేకరణలో రైతుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రైతుకు తిరిగి ఇవ్వాలి. రవాణా ఖర్చులు, తరుగు, నూక పేరుతో వసూలు చేసిన మొత్తాలను రైతుకు చెల్లించాలి జగన్ కు అర్థం కాకపోవచ్చు. కానీ నేర్చుకోవాలనే ఆలోచన లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. ధాన్యంమొత్తం ప్రభుత్వమే కొనాలి. కొన్న ధాన్యానికి వెంటనే మద్దతు ధర రైతుకు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. మీ డబ్బులు ఇప్పించడానికి నేను సిద్దంగా ఉన్నా. రైతులు కూడా నాతో కలిసి పోరాటానికి కదలిరావాలి అని పిలుపునిచ్చారు. రైతాంగంలో ధైర్యం రావాలి. ఈ ప్రభుత్వం బెదిరిస్తుందని భయపడకండి. సమస్యలపై నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చింది అని చంద్రబాబు చెప్పారు.

బుద్ధి తెచ్చుకోవాలి

ప్రభుత్వం మనం మీటింగ్ లు పెట్టుకోకుండా తెచ్చిన జీవో నెంబర్ 1ను కోర్టు కోట్టేసింది. ఇది ప్రజా స్వామ్య విజయం. అని చంద్రబాబు పేర్కొన్నారు. నేను మీటింగ్ లు పెట్టకూడదా? మరి నాడు జగన్ రెడ్డి మీటింగ్ లు ఎక్కడ పెట్టాడు? జీవో నెంబర్ 1 తెచ్చి నేను అనపర్తికి పోతే, నా మీటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాడు 9 కిలోమీటర్లు నడిచి. నల్ల చట్టాలను ధిక్కరించి మీటింగ్ లు పెట్టాం. జీవో నెంబర్ 1 పై సైకో ముఖ్యమంత్రి బుద్ది తెచ్చుకోవాలి అని చంద్రబాబు సూచించారు. నేరస్తుడికి అధికారం ఇవ్వొద్దంటే నాడు మీరంతా వినలేదు, ఒక చాన్స్ అంటే కరిగిపోవద్దు అని నాడే చెప్పాను. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు అదే అయ్యిందన్నారు.

విభజన తరువాత రెవెన్యూ లోటుతో పాలన ప్రారంభించాను. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా పాలన చేశాను. నాడు హుద్ హుద్ వస్తే అక్కడే ఉండి సాయం చేశాను. 2014 తరువాత వ్యవసాయంలో 11 శాతం వృద్ది రేటు సాధించాను. రుణమాఫీ కింద ఒకే సారి రూ.50 వేలు రైతుకు మాఫీ చేశాను. మనం అధికారంలో ఉండి ఉంటే 4,5 విడతల రుణమాఫీ కూడ మీకు అందేవి అని చంద్రబాబు వివరించారు. జగన్ కు పిచ్చి ముదిరింది. ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లింది. నేను రైతు వ్యతిరేకి అని జగన్ అంటున్నాడు. నేను 5 ఏళ్లు ఏం చేశానో, నువ్వు ఏం చేశావో చర్చకు సిద్దమా? అని సవాల్ చేశారు. నాడు మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇచ్చాం.యంత్రాలు ఇచ్చాం. రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం.

రైతుకు అండగా నిలిచినపార్టీ టీడీపీ. రైతును నిండాముంచిన పార్టీ వైసీపీ. మళ్లీ జగన్ గెలిచేది లేదు. జగన్ పని అయిపోయింది అని చంద్రబాబు చెప్పారు. వ్యక్తులు, సంస్థలపై తప్పుడు కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం. ఈనాడులో వార్తలు రాస్తే మార్గదర్శిపై దాడి, రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారు. తప్పుల్ని ప్రశ్నించిన వారిపై దాడి చేయడం తప్ప ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. పోలవరం పూర్తి చేసి ఉంటే రెండు జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. నాడు 72 శాతం పోలవరం పూర్తి చేశాం అని వివరించారు. టీడీపీ ఉండి ఉంటే రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగేది. రాష్ట్రం సుభిక్షం అయ్యేది. ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి. పోలవరాన్నినాశనం చేశాడు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ తెలీదు. ఈ రాష్ట్రానికి ఏంటీ దరిద్రం అనేది అంతా ఆలోచించాలి అని చంద్రబాబు కోరారు.

సంక్షేమ కార్యక్రమాలు రెట్టింపు చేస్తాం

బటన్ నొక్కడం కాదు. జగన్ చేసేది. బొక్కటం. జగన్ అతని ఎమ్మెల్యేలు కలిసి దోచుకుంది రూ. 5 లక్షల కోట్లు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా లాంటి పథకాలు తీసివేసి, నేను వస్తే పథకాలు తీసేస్తా అని ప్రచారం చేస్తున్నాడు జగన్. జగన్ రూ 10 లక్షల కోట్లు అప్పులు చేసి, ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలి అని చూస్తున్నాడు. సంక్షేమం మొదలు పెట్టిందే ఎన్టీఆర్. మనం వచ్చిన తరువాత అభివృద్ది చేస్తాం. రెట్టింపు సంక్షేమకార్యక్రమాలు చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చింది, పిపిపిపి అనే విధానం ద్వారా పేదల జీవితాలను మార్చుతా.

పబ్లిక్, ప్రైవేట్, ప్రభుత్వ పార్టనర్ షిప్ తో మార్పు చేసి చూపిస్తా అని చెప్పారు. మనది విశ్వసనీయత, జగన్ ది ఫేక్ న్యూస్ అవినీతికి చిరునామా 43 వేల కోట్ల అవినీతి అని సిబిఐ తేల్చింది. జగన్ అవినీతి చేసిన 43 వేల కోట్లు గ్రామాల్లో బూత్ లలో పంచితే బూత్ కు ఒక కోటీశ్వరుడు అవుతారు. జగన్ ఇప్పుడు 2 లక్షల అక్రమార్జన చేశాడు. ఆ డబ్బు పంచితే రెండు లక్షల మంది కోటీశ్వరులు అవుతారు అని పేర్కొన్నారు. దేశంలో రిచ్చెస్ట్ సిఎం జగన్ రెడ్డి. అతను ప్యాలెస్ లు, లక్షల కోట్లు పెట్టుకుని క్లాస్ వార్ అంటున్నాడు. వచ్చేది క్లాష్ వార్ కాదు. అవినీతిపై వార్. జగన్, అతని ప్రభుత్వ దోపిడీ పై వార్ జరుగుతుంది అని చెప్పారు. ఇసుక దొరకకపోవడం వల్ల 40 లక్షల కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.

మద్యపాననిషేదం అని చెప్పి, మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తెచ్చాడు. అదీ జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మనం ఉన్నసమయంలో కరెంట్ చార్జీలు పెరగలేదు…ఇప్పుడు కరెంట్ చార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి. జగన్ పేదవాళ్ల కోసం పనిచేసే వ్యక్తి కాదు. జగన్ డబ్బుల పిచ్చోడు. దేశంలో అందరూ పేదవారిగా ఉండాలి. కానీ జగన్ ఒక్కడే ధనికుడిగా ఉండాలి. అందుకే చెపుతున్నా. ఐదుకోట్లమందికి ఈ సైకో జగన్ కుమధ్య జరిగే యుద్దం జరగబోతుంది అని చంద్రబాబు వెల్లడించారు.

మంత్రి పదవి నుంచి తొలగించాలి

ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు. అతను ఎర్రిపప్ప. అంటే అర్థం బుజ్జినాన్న. ఇతను వెర్రిపప్పా, బుజ్జినాన్నా? మా అచ్చెన్న చెప్పినట్లు మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు. రెండో వెర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే జగన్ మంత్రి కారుమూరిని మంత్రిపదవి నుంచి తొలగించాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనలేని మంత్రి మనపై విమర్శలుచేస్తున్నాడు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఈ మంత్రులు నన్ను బెదిరిస్తారా? ఈ మంత్రి అనుకుంటే నేను తణుకు దాటనా? తీవ్ర వాదులతో పోరాడిన పార్టీ టీడీపీ. ఆకు రౌడీలకు భయపడతానా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేతల తప్పులు అన్నీ లెక్క పెడుతున్నా. అన్నిటికీ బదులిస్తా అని హెచ్చరించారు. ఈ రోజు సభ నుంచి చెపుతున్నా. కౌలు రైతును ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

Tags: chandrababuchandrababu interaction with farmers at tanukuchandrababu latest speechchandrababu livechandrababu live todaychandrababu meetingChandraBabu Naiduchandrababu naidu with farmers in tanukuchandrababu public meetingchandrababu speechchandrababu speech in tanukuchandrababu tanukuchandrababu tanuku speechchandrababu tanuku tourchandrababu with farmersDalit Bandhu CBNTDP
Previous Post

టిడిపి మహానాడు ప్రాంగణానికి భూమిపూజ

Next Post

మహానాడు కమిటీలో ప్రత్తిపాటికి అవకాశం

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం
ఆంధ్రప్రదేశ్

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist