* అక్కడి పరిస్థితిని మంత్రులకు వివరించిన వైనం
* కేబినెట్ భేటీ అనంతరం చర్చలో ప్రస్తావన
* విశాఖ పార్టనర్షిప్ సమ్మిట్కు వస్తున్నట్టు వెల్లడి
* ‘స్త్రీశక్తి’ ప్రారంభంలో తప్పక ఉండాలని ఆదేశం
* పాలనలో మరింత వేగం పెరగాలి
* మంత్రులు దూకుడు పెంచాలని సీఎం సూచన
అమరావతి (చైతన్య రథం: జగన్ ప్రభుత్వ అరాచక పాలనలో సింగపూర్ ప్రభుత్వం ఎంత భయపడిందో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో మరోసారి ద్యోతకమైంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సింగపూర్ పర్యటనా విశేషాలను చర్చించిన చంద్రబాబు… జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా సింగపూర్లో ఎదురైన పరిణామాలను ప్రస్తావించారు. ఏపీపై సింగపూర్కు సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. జరిగింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయాంశాలు సహా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతోపాటు.. తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు.
చర్చలో భాగంగా… పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలికగా అంగీకరించలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. వైకాపా హయాంలో సింగపూర్ వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా వ్యవహారంతో ఏపీపట్ల సింగపూర్ విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు.. అక్కడికి వెళ్లి మరీ సింగపూర్ మంత్రులను బెదిరించారని వాళ్లే చెబుతున్నారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు మంత్రులకు వివరించారు. సీడ్ క్యాపిటల్లో తాము భాగస్వామ్యం కాబోమని సింగపూర్ స్పష్టం చేసిందన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్కు వాళ్లని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్టు పేర్కొన్నారు. అందుకు వాళ్లు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నట్టు సీఎం వివరించారు.
స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తు న్నామని.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనా లని కేబినెట్ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవమని.. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటా యని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ టైమ్ అథ్లెట్ చేసుకుని కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని సీఎం సూచించారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సీఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంచి సూచన చేశారంటూ నాదెండ్లకు చంద్రబాబు కితాబిచ్చారు. ఆటోడ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన దుకాణాల్లో బినామీలు వస్తే సహించబోనని సీఎం హెచ్చరించారు.
మంత్రులు దూకుడు పెంచాలి
“మంత్రులు ఏడాదిగా సబ్జెక్టు నేర్చుకుంటూ మెరుగ్గా పనిచేశారు. ఇక హనీమూన్ కాలం వదిలి పాలనలో దూకుడు పెంచాలి. తప్పుడు వార్తల ప్రచారం, వైకాపా కుట్రలు, అతి తెలివైన నేరగాళ్లపట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. మహిళలపై అసభ్య వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలి. అంతర్జాతీయ సంబంధాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. సింగపూర్ విధానాల స్టడీకి మంత్రులు దశలవారీగా అక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి సానుకూలత ఉంది. మంత్రుల పనితీరుతో అది మరింత పెరగాలి. ఎమ్మెల్యేలతో మాట్లాడా.. పొరపాట్లు సరిదిద్దుకుంటామని చెప్పారు. జనసేన, భాజపా నేతలు కూడా లోపాలను సరిదిద్దుకోవాలి. మంత్రులు తమ శాఖలపై ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసుకోవాలి. వచ్చే క్యాబినెట్ భేటీలో ప్రతి మంత్రితో వారి శాఖపై మాట్లాడిస్తా” అని చంద్రబాబు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు టికెట్ నమూనాను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు చూపించారు.
తొలుత ఈ కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించేదిలేదని హెచ్చరించింది. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే.. ఆటో డ్రైవర్లను పిలిపించి వారితో మాట్లాడాలని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశంలో సూచించారు. ఈ సూచనపై సీఎం చంద్రబాబు సాను కూలంగా స్పందించారు. ఆటో డ్రైవర్లను వెంటనే పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్లో భాగంగా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జులై 26నుంచి 31వ వరకు సింగపూర్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో ఆయన వరుసగా భేటీలు నిర్వహించారు. ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను వారికి సీఎం
చంద్రబాబు సోదాహరణగా వివరించారు. ఇక ఈ ఏడాది నవంబర్లో విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సింగపూర్లోని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించారు. అదేవిధంగా దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సంస్థలను సీఎం చంద్రబాబు సందర్శించిన విషయం విదితమే. ఈ సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట.. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ పర్యటనను ముగించుకొని జులై 30న చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరతు అమరావతికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.