- ప్రతి పౌరుడికీ డిజీ లాకర్ సదుపాయం కల్పిస్తాం
- వాట్సాప్లోనే అన్ని పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు
- డేటా అనుసంధానంతోనే పౌరులకు మెరుగైన సేవలు
- ఆ ప్రక్రియను అధికారులు సత్వరమే పూర్తి చేయాలి
- ప్రతి శాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించాలి
- ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆదేశాలు
అమరావతి(చైతన్యరథం): రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీ కరణ పత్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్ లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందుపరచవచ్చని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు. దీనికోసం ప్రతి పౌరుడికి ప్రత్యేకంగా డిజీ లాకర్ సదు పాయం కల్పించున్నామన్నామని వెల్లడిరచారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియపై ఆయా శాఖలు, విభాగాధిపతులతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రభు త్వంలో ఇప్పటికీ కూడా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా అనేది లేదన్నారు. ఆయా శాఖల్లో చాలా డేటా ఉన్నప్పటికీ అది ఇప్పటికీ ఒకచోట అనుసంధానం కాలేదని, దానివల్ల పౌరు లకు ప్రభుత్వం అందించే సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి సాంకేతిక అవరోధాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌరులకు వారికి కావాల్సిన అన్ని సేవలు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా నే అందించాలన్నది ముఖ్య మంత్రి చంద్రబాబు ఆశయమన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్ను ఏర్పాటు చేస్తుందన్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను ఈ డేటా లేక్తో అనుసంధానం చేస్తామని, తద్వారా పౌరులకు డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా అందించే సదుపాయం కల్పిస్తామని వివరించారు.
కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
పౌరులు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం ఏ కార్యాలయానికి, ఏ అధికారి వద్దకు వెళ్ల కుండా తమ ఫోన్లోనే ఇట్టే సులభంగా పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించినట్లు చెప్పారు. దీనికోసం మెటా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలి పారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉన్నాయ న్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు, ధృవీకరణ పత్రాలు ఇందులో పొందే సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఒక పౌరుడు తనకు సం బం ధించిన విద్యార్హత, కుల, ఆదాయ, జనన, మరణ తదితర ధృవీకరణ పత్రాలు మొత్తం కూడా వాట్సాప్ ద్వారానే డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండబోదన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించి సర్టిఫికె ట్లను భౌతికంగా తమతో తీసుకెళ్లాల్సిన అసవరం ఉండబోదని, తమ ఫోన్లోనే ఆ సర్టిఫికెట్ల ను డౌన్ లోడ్ చేసుకుని పొందుపరచవచ్చన్నారు.
ఆ దిశగా వాట్సాప్ గవర్నెన్స్ను ప్రభు త్వం అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి పౌరుడికి డిజీ లాకర్ సదుపాయం కల్పించి వారు తమ ధృవీకరణ పత్రాలు అందులో భద్రపరచుకునేలా చేస్తామని వివరించారు. వాట్సాప్ ద్వారానే పౌరులు చెల్లింపులు కూడా నిర్వహించుకునే సదుపాయం కల్పిస్తున్న ట్లు వివరించారు. వాట్సాప్లోనే ప్రభుత్వానికి అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందిస్తున్నామని, అయితే సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉన్న ప్రజల సౌకర్యార్థం ప్రాంతీయ భాషలైన తమిళం, ఒరియా, కన్నడ భాషల్లో కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిరచారు. చదువు రాని పౌరులు తాము నేరుగా వాయిస్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదు, అర్జీలు సమర్పించే అవకాశం కూడా కల్పించడానికి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అయితే ఇవన్నీ పౌరులకు మరింత మెరుగ్గా అందించాలంటే శాఖల మధ్య డేటా అనుసంధానం వేగవంతంగా జరగాల్సిన అవసరముందని చెప్పారు.
సీడీటీఓను నియమించుకోండి
ప్రతి శాఖలోనూ ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీఓ)ను నియమించు కోవా లని అధికారులకు సూచించారు. తమ శాఖలో అలాంటి వ్యక్తిని రెండురోజుల్లోపు గుర్తించి వారికి ఈ బాధ్యతలు అప్పజెప్పాలని తెలిపారు. అదే విధంగా ఆర్టీజీఎస్ డేటా లేక్తో ఆయా శాఖలు తమ వద్ద ఉన్న డేటాను షేర్ చేసుకునే ప్రక్రియ వారంరోజుల్లో పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణదాధికారి కె.దినేష్కుమార్, డిప్యూటీ సీఈవో మాధురి, పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సౌరవ్ గౌర్, ఐజీ టెక్నికల్ సర్వీస్ శ్రీకాంత్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, జీఎస్డబ్ల్యూ డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.