- ఏం చెప్పినా జనం నమ్ముతారనే భ్రమల్లోంచి బయటకు రండి
- కక్ష సాధింపు, కుట్రలు మీ బ్రాండ్
- ప్రజాస్వామ్యంపై మీరు మాట్లాడటం హాస్యాస్పదం
- మంత్రి లోకేష్ మండిపాటు
అమరావతి (చైతన్యరథం): పచ్చి అబద్ధాలు అలవోకగా వల్లె వేయటంలో జగన్ రెడ్డి మాస్టర్స్ దాటి పీహెచ్డీ కూడా చేసినట్లుగా కనపడుతోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వేలాది ప్రజల సాక్షిగా బహిరంగంగా, కోట్లాది ప్రజలు టీవీల్లో చూస్తుండగా జరిగిన దారుణాలను కూడా.. ఏమీ జరగలేదన్నట్లుగా చెప్పటం జగన్రెడ్డికే చెల్లిందని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డీ.. పచ్చి అబద్ధాలను నిజాలని భ్రమింపజేసేలా కాన్ఫిడెంట్గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది ప్రజలు టీవీల్లో కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి. అధికారం ఉన్నప్పుడు యథేచ్ఛగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేష్ మండిపడ్డారు.