- ముస్లింల పక్షపాతి సీఎం చంద్రబాబు
- ఇమామ్ లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల హర్షణీయం
- సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నసీర్, ముస్లిం నాయకులు
గుంటూరు (చైతన్యరథం): ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగా ఇమామ్ ు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ అన్నారు. రాష్ట్రంలోని ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞత సభ, ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభ్యున్నతికి మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వేల మసీదుల్లో ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇచ్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇది ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
అధికారం చేపట్టిన కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఇమామ్లు, మౌజన్ల ఆరు నెలల గౌరవ వేతనం రూ.45 కోట్లు విడుదల చేయడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు రంజాన్ తోఫా వంటి కానుకలు అందించారని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ముస్లింలకు మొండి చెయ్యి చూపారని విమర్శించారు. ఇమామ్ లకు, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని, మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ముస్లింలకు పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావలి, చిష్టి, జమీర్, హఫీజ్, రఫీ, అన్వర్, భాషి, జాబి, ఉస్మాన్, అబ్దుల్లా, నూర్, ఖలీల్, అబ్బాస్, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.