- జైలుకు వెళ్లి వచ్చి దాడి చేసేందుకు యత్నం
- కాపాడాలంటూ గ్రీవెన్స్లో బాధితుడి ఫిర్యాదు
- అర్జీ తీసుకుని పరిష్కరించిన మంత్రి అనగాని
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించి న అర్జీల స్వీకరణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పీతల సుజాతలు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కా రానికి కృషి చేశారు. వైసీపీకి చెందిన బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ యర్రగొల్ల గోపాల స్వామి గుంటూరులో ఉంటున్న తమపై దాడికి యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. తమ ది వాస్తవానికి బద్వేల్ మండలం ఎల్లుగారిపల్లె గ్రామం కాగా అక్కడ నుంచి వచ్చి గుంటూరులో ఉంటున్నట్లు చెప్పారు. ఓ భూ కేసులో గోపాలస్వామి జైలుకుపోవడంతో దానికి కారణం తానేనని కక్ష పెంచుకుని తమపై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నా రని తెలిపారు. వారిపై చర్యలు తీసుకుని తమకు ఇబ్బంది లేకుండా చూడాలని మురా రాజన్న కోరారు. అర్జీల స్వీకరణ అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని మాట్లాడుతూ వస్తున్న అర్జీల్లో ఎక్కువ భాగం కుటుంబసభ్యుల మధ్య తగాదాలే ఉన్నాయని, కోర్టుల్లో తేల్చుకోవాల్సిన అర్జీలు కూడా ఉన్నట్లు చెప్పారు. వాటి కోసం గ్రీవెన్స్లో ప్రత్యేకంగా లాయర్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
` తమ భూమిని తమకు తెలియకుండా నరసరావుపేటలో దార్ల వీరభద్రాచారి, అన్నపురెడ్డి వెంకటరెడ్డి తదితరులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన షేక్ షైనా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
` అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన ఎం.శ్రీనివాసరాజు తన సమస్యను వివరిస్తూ తన భూమిని రౌడీషీటర్ లాక్కుని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించు కున్నాడని తెలిపారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై విచారించి తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాడు.
` శ్రీ సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామానికి చెందిన ఎమ్.వెంకటేష్ విజ్ఞప్తి చేస్తూ.. తనను మోసగించి సంతకం చేయించుకుని చిట్రా శివయ్య అనే వ్యక్తి తన భూమిని కొట్టేశాడని వివరించారు. అతని నుంచి తనకు రావాల్సిన భూమిని ఇప్పిం చాలని అభ్యర్థించాడు.
` తాను సైబర్ క్రైమ్ వల్ల రూ.8,00,000 లక్షలు పోగొట్టుకున్నానని.. దానిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదని కడప జిల్లా కడపకు చెందిన పెంచ లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు తీసుకుని సైబర్ మోసగాళ్లపై చర్యలు తీసుకునేలా చూడాలని అభ్యర్థించాడు.
` తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామానికి చెందిన కె.ధనుం జయరావు సమస్యను వివరిస్తూ గ్రామంలో తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు మంజూరు అయినా అడంగల్లో ఇనాం భూమిగా ఉందని తెలిపారు. ఇనామ్ భూమి నుంచి రైతువారి పట్టా భూమిగా వెబ్ పోర్టల్లో మార్చాలని కోరారు.
` ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఫణికుమార్ విజ్ఞప్తి చేస్తూ తాను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానని పాత గవర్నమెంట్ రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మిగిలిన రెండేళ్లు ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్లు కాలేజీలో ఉండిపోయాయని చెప్పారు. దయచేసి పెండిరగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు ఇచ్చేలా చూడాలని అభ్యర్థించాడు.
` తమ ఆధీనంలో ఉండి అనుభవంలో ఉన్న పొలాన్ని చిలమత్తూరు రిజిస్ట్రర్ కార్యా లయంలో సంబంధం లేని.. ఎటువంటి దస్తావేజులు లేని వ్యక్తులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఎన్.శ్రీధర్ తెలిపాడు. విచారించి అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు.