- రూ.1,47,162 కోట్లతో ఉక్కు పరిశ్రమ
- లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు
- పరిశ్రమలు, వాణిజ్య మంత్రి టి.జి.భరత్
అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరి కీ తెలియాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమి చ్చారు. మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలా ర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ పరిశ్రమ రాబోతుందని తెలిపారు. రూ.1,47,162 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో (మొదటి దశలో రూ.61,780 కోట్లు, రెండో దశలో రూ. 85,382 కోట్లు) ఈ పరిశ్రమ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా లక్ష మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని వివరించారు. 17.8 ఎంపీటీఏ సామర్థ్యంతో రెండు దశలలో (మొదటి దశలో 7.3 ఎంటీపీఏ, రెండో దశలో 10.5 ఎంటీపీఏ) ఏకీకృ త ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారని వివరించారు.
అప్పట్లో ఒడిశాలో పరిశ్ర మ పెట్టాలన్న ఆలోచన వారికి ఉండేదని చెప్పిన ఆయన.. 2018లో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆదిత్య మిట్టల్ను మంత్రి నారా లోకేష్ కలిసి పరిశ్రమను ఏపీలో పెట్టాలన్న దానిపై చర్చించినట్లు గుర్తుచేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో ఏపీలో పరిశ్రమ పెట్టాలని ప్రభుత్వం కోరినా అది జరగలేదని తెలిపారు. మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వం రావడంతో ఒకే ఒక్క జూమ్ కాల్లో ఆదిత్య మిట్టల్తో మాట్లాడి ఏపీలో పరిశ్రమను పెట్టేలా ఒప్పించారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వం, ఎన్డీయే ప్రభు త్వం ఉందన్న నమ్మకంతోనే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా ఇది నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన దావోస్ సద స్సులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టేం దుకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించినట్లు తెలిపారు.