- దేశంలోనే తొలిసారిగా రూ.750 కోట్లతో నిర్మాణం
- భూమి కేటాయించాలని కేంద్ర ఆయుష్ శాఖ లేఖ
- 450 పడకలతో అందుబాటులో ప్రకృతి వైద్యసేవలు
- యూజీలో వంద, పీజీలో 20 చొప్పున సీట్లు రాక
- పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేక కేంద్రం
- కేంద్రానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కృతజ్ఞతలు
అమరావతి(చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసా రిగా అపెక్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి (ఆర్వైఎస్)ను రాష్ట్రంలో రూ.750 కోట్లతో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిరచారు. ఎయిమ్స్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు సెంట్రల్ కౌన్సెల్ ఫర్ రీసెర్చి అండ్ యోగా అండ్ నేచురోపతి (మినిస్టరీ ఆఫ్ ఆయుష్) ద్వారా ఏర్పాటుకానున్న ఈ ప్రముఖ విద్యా సంస్థలో యూజీ (బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సర్జరీ)లో తొలి ఏడాదిలో వంద సీట్లు, పీజీలో 20 సీట్ల చొప్పున భర్తీ జరుగుతుందని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా 450 పడకలతో అన్ని రకాల వసతులతో నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్థలో రీసెర్చి అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థ ఏర్పాటుకు 40 ఎకరాలను కేటాయించాలని కేంద్ర ఆయుష్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. కొత్త వైద్య కళాశాల రాకతో నేచురోపతి వైద్యం మరింత విస్తరిస్తుం దని, నేచురోపతి వైద్యులు పెరుగుతారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆయుష్ శాఖ సానుకూలంగా స్పందించి అతున్నత సంస్థ ఏర్పాటుకు ముందుకు రావడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్ శాఖ తరపున జాతీయ వైద్య సంస్థలు నడుస్తున్నాయి. వీటికంటే ఉన్నత స్థాయిలో రాష్ట్రంలో రాబోయే ఈ సంస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు మండలంలో రీసెర్చి ఇనిస్టిట్యూట్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిరపాలెం (కాటూరు వైద్య కళాశాల వద్ద) సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా, నేచురోపతి సంస్థను ఏర్పాటు చేయబోతుంది. దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం 12.96 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ కేవ లం వైద్యసేవలు మాత్రమే అందుబాటులోకి వస్తారు. ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తుంది. విశాఖలో నేచు రోపతి కళాశాల నిర్మాణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశా లలో నేచురోపతి కోర్సులో వంద సీట్ల భర్తీకి కేంద్రం నుంచి ఆమో దం లభించనుంది.
తొలిసారిగా రూ.165.65 కోట్లు
గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ఆయుష్ శాఖ 2025-26 బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.165.65 కోట్లను కేటా యించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొలివిడత కింద తన వాటా కింద 50 శాతం నిధులు మంజూరుచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా విడుదల చేసింది. కేంద్రం ఆమో దం తెలిపిన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయి. అలాగే ధర్మవరంలో ఆయుర్వే ద వైద్యకళాశాల కొత్తగా రాబోతుంది. ముఖ్యమైన పట్టణంలో యూనాని వైద్య కళాశాల కూడా ఏర్పాటుకానుంది. మంత్రి సత్య కుమార్ చూపుతున్న చొరవతో ఆయుష్ వైద్యానికి మహర్దశ పట్టింది.















