విజయవాడ (చైతన్యరథం): అప్కాబ్ చైర్మన్గా నియమితులైన గన్ని వీరాంజనేయులు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు తోడురాగా అప్కాబ్ అధికారులు, సిబ్బంది సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కార్యాలయం వద్దకు చేరుకున్న వీరాంజనేయులికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గన్ని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ ఎండీ ఎస్ఆర్ రెడ్డి, సీజీఎం, డీజీఎం, ఏజీఎంలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న వీరాంజనేయులు.. అందరం కలిసికట్టుగా పనిచేసి అప్కాబ్ అభివృద్దికి కృషి చేద్దామన్నారు. ముందుగా అప్కాబ్ ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పదవీ భాద్యతల అనంతరం సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ (సీసీ కెమెరా యూనిట్)ను ప్రారంబించి తదుపరి అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరం సందర్భంగా ఆవరణలో మొక్క నాటారు. ఆప్కాబ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు.