- ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు అనుమతులు
- జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం
- వచ్చే జనవరికి పనులు ప్రారంభించాలని నిర్దేశం
అమరావతి(చైతన్యరథం): కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్ డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో మొదటిదశ, రూ.16350 కోట్లతో రెండో దశ పనులు చేపట్టే ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమో దించింది. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్కు ప్రోత్సాహకాలిస్తూ, ప్యాకేజీని విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్, నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చర్యలకు ఆమోదించింది. సున్నపు రాళ్లపల్లె పరిధిలో ఎకరా రూ.5 లక్షల చొప్పున 1100 ఎకరాల భూములను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 2026 నాటికి స్టీల్ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని నిర్దేశిం చింది. ఏప్రిల్ 2029 నాటికి స్టీల్ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దిశా నిర్దేశం చేసింది. జనవరి 2031 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు ప్రారంభిస్తామని ప్రతిపాదనల్లో తెలిపింది జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ సంస్థ. ఏప్రిల్ 2034 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని జేఎస్ డబ్ల్యూ సంస్థ ప్రతిపాదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రతిపాదలనలను ఆమోదిస్తూ ఆదేశాలిచ్చింది ఏపీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సంస్థకు ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాలని తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, రెవెన్యూ, ఆర్థిక శాఖ అధికారులను ప్రభుత్వం ఆదే శించింది. ఏపీఐఐసీ వీసీ అండ్ చైర్మన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమ లు వాణిజ్య శాఖ కార్యదర్శి వై.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.