- పెట్టుబడులతో రండి.. భరోసా కల్పిస్తాం
- స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం
- టూరిజం కాన్క్లేవ్లో మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ(చైతన్యరథం): ఏపీలో టూరిజం ప్రాజెక్టుల వేగ వంతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకులకు ప్రపంచ స్థాయి అనుభవాల కల్పన, స్థానిక భాగస్వామ్యాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇన్వెస్టర్ల సహకారం అవసరమని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. శుక్రవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని మురళీ ఫార్చూన్ హోటల్లో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం, ఏపీటీడీసీ సంయుక్తంగా రెండోరోజు నిర్వహించిన టూరిజం కాన్క్లేవ్ టెక్ ఏఐ 2.0లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తొలిరోజు పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే అంశాలపై చర్చ జరగగా.. రెండో రోజు రాష్ట్ర పర్యాటక విధా నాలు, నిర్దేశిత లక్ష్యాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీ పర్యాటకం పెట్టుబడులకు అనుకూలమని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆలోచనలు పంచుకుని పెట్టుబడులతో వస్తే భరోసా కల్పించే బాధ్యత తమదని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చా రు. తొలిరోజు పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే అంశాలపై జరిగిన చర్చలో ఇన్వెస్టర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసు కుంటామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఏపీలో పర్యాటకరంగానికి సీఎం చంద్రబాబు పారిశ్రామిక హోదా కల్పించడంతో అభివృద్ధికి ఊతం వచ్చిందని, అనంతరం పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయ న్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయ మని సూచించారు. గత ఐదేళ్లలో టూరిజం నిరాదరణకు గురైం దన్నారు. ఇప్పటికే నూతన పర్యాటక పాలసీ ప్రకటించామని తెలిపారు. సుస్థిర, సమగ్ర పర్యటకాభివృద్దికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్, శాస్కి, సీబీడీడీ స్కీమ్ల ద్వారా వందలాది కోట్ల నిధులు కేంద్రం మంజూ రు చేసిందని తద్వారా పర్యాటక అభివృద్ధి పట్టాలెక్కుతుం దన్నారు. పీపీపీ విధానం ద్వారా పర్యటకాభివృద్ధి చేస్తున్నామన్నారు. జూన్ 26న రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు.
ఆరు అంశాలతో ముందుకు..
బ్రాండిరగ్, మార్కెటింగ్, ఉత్పత్తి, ప్రాజెక్టులు, పెట్లుబడులు, భాగస్వామ్యం, టెక్ ఎనేబుల్మెంట్, క్రియేటివ్ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్ తదితర ఆరు అంశాలపై ఏపీ పర్యాటక రంగం ముందుకు తీసుకువెళ్తున్నామని వివరించారు. పర్యాటక ప్రాజెక్టులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టు బడులు పెట్టండి..స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని ఇన్వెస్ట ర్లకు భరోసా ఇచ్చారు.