- జగన్రెడ్డిపై మంత్రి లోకేష్ ఫైర్
- మీ పాలన రాష్ట్రానికి చీకటి అధ్యాయం
- నేను మహిళలను గౌరవిస్తూ పెరిగాను
- మీరు తల్లిని, చెల్లిని వెళ్ళగొట్టి, రోజూ అవమానిస్తున్నారు
- నాది కాలేజీ లైఫ్.. మీది జైల్ లైఫ్
అమరావతి (చైతన్యరథం): వైసీపీ కరపత్రిక సాక్షిలో వస్తున్న అభూత కల్పనలు, అసత్య కథనాలపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మండిరచిన జగన్ రెడ్డి ఇప్పుడు తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి కపటత్వాన్ని చూసి నవ్వుకోవటం మినహా తాను చేయగలిగింది లేదని చురకలు వేశారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ పెట్టారు. జగన్ రెడ్డీ.. మీ కపటత్వాన్ని చూసి నవ్వుకోవటం మినహా ఏమీ చేయలేను. నాకు కాలేజీ జీవితం ఉండేది, మీకు జైలు జీవితం ఉండేది. నాకు క్లాస్మేట్స్ ఉండేవారు, మీకు జైలు సహచరులు ఉండేవారు. నేను మహిళలను గౌరవిస్తూ పెరిగాను. స్త్రీలను గౌరవించేలా నన్ను పెంచారు. మీరు మీ సొంత తల్లిని, సోదరిని బయటకు వెళ్ళగొట్టారు.
వారిని కోర్టుకు లాగారు. మీ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ వారి శీల హననం చేస్తున్నారు. అదే మీకు.. నాకు తేడా. ముఖ్యమంత్రిగా మీ ఐదేళ్ల పాలన రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయం. ప్రతీకార రాజకీయాలకు పరాకాష్టగా.. దళితులు, మహిళలపై దమనకాండకు, దారుణాలకు, అబద్ధాలకు నిలయంగా నిలిచింది. మీ దుష్టపాలనను వ్యతిరేకించిన ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడిపించారు. ఇప్పుడేమో నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మీ హయాంలో, మీ కనుసన్నల్లో మీ పార్టీ నేతలు చేసిన నేరాలను మాకు ఆపాదించే ప్రయత్నాలు మానుకోండి. మీ తప్పులకు ఎదుటివారిపై బురద జల్లడం ఆపండి. కప్పిపుచ్చుకునే కాలం ముగిసింది. అర్థం అయ్యిందా రాజా.. అంటూ మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.