అమరావతి (చైతన్యరథం): ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై ఏడాది నిండిరదని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిరదన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.