- సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలనపై నేతల హర్షం
- ప్రజారంజక పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు సాగాలని నేతల ఆకాంక్ష
అమరావతి (చైతన్యరథం): రాక్షస పాలనను పాతి పెట్టి ప్రజారంజక, ప్రజాస్వామ్య, రాజ్యంగబద్ధ కూటమి పాలనకు ప్రజలు కంకణం కట్టి ఏడాదైన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు గురువారం భారీ కేక్ను కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజాపాలన: వర్ల రామయ్య
పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ..జగన్ రెడ్డి అరాచక, రాక్షస, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు స్వస్తి పలికి అప్పుడే సంసవత్సరం అయ్యిందా అనిపిస్తోందన్నారు. ప్రజా పాలకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఏడాది అయినట్లే లేదు. రాష్ట్రంలో ప్రజారంజక, ప్రజాస్వామ్యయుత, రాజ్యంగబద్ధమైన పాలన సాగుతోంది. నేడు కూటమి ప్రభుత్వంలో అరాచకాలకు, విధ్వంసాలకు తావులేదు, అవినీతికి రాక్షస పాలనకు తావులేదు. అన్నీ రాజ్యంగబద్ధంగా చట్టబద్ధంగా నడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తల్లికి వందనం పేరుతో చదువుకునే ప్రతి బిడ్డకు రూ. 15 వేలు బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు మహిళలను అగౌరపరుస్తుంటే, అవహేళన చేస్తుంటే, అసభ్యకరంగా మాట్లాడుతుంటే కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనంతో అమ్మలను, మహిళా మూర్తులను టీడీపీ, కూటమి పార్టీలు ప్రభుత్వం గౌరవిస్తున్నాయి. గత ఐతేళ్లు జగన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీపై మా అధినేత సంతకం చేశారు.
అనుకున్నట్లే నేడు 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చారు. మరో నెల రోజుల్లో వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి. భారత దేశంలో ఎక్కడా కూడా రూ.4వేల పింఛన్ లేదు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే అందిస్తోంది. పింఛన్ దారులకు భరోసాగా నిలుస్తుంది. ఆర్టికల్ 19 భావ ప్రకటనా స్వేచ్ఛను గత ప్రభుత్వం తుంగలో తొక్కింది. నేడు ప్రజలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. నాడు వైసీపీ పాలనలో గుంటూరు జిల్లా ఆత్మకూరులో దళిత వర్గాలను గ్రామం నుండి తరిమికొడితే వారికి అండగా ఉండేదుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా జగన్ రెడ్డీ? అది ప్రజాస్వామ్యం ఎంతమాత్రం కాదు. తాజాగా జగన్ రెడ్డి పొదిలి వెళ్లి నానా హంగామా చేసినా మేము ఆటంకాలు సృష్టింలేదు. నీ ఇంటి గేట్లకు తాళ్లు కట్టలేదు.. మీకు స్వేచ్ఛను ఇచ్చాం.. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నేడు ప్రజాస్వామ్య పాలనలో, మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వర్ల రామయ్య అన్నారు.
ప్రజారంజక పాలన: పంచుమర్తి
శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ..నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడి, ప్రజలు గెలిచారంటే.. అందులో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు కృషి మరువలేనిదన్నారు. నాడు చంద్రబాబు 72 శాతం పోలవరం పనులు పూర్తి చేస్తే… దాన్ని ముందుకు తీసుకెళ్లకపోగా ప్రాజెక్ట్ను జగన్ రెడ్డి సర్వ నాశనం చేశాడు. అమరావతికి మద్దతు తెలిపి అధికారం చేజిక్కిన వెంటనే మూడు ముక్కలాటతో అమరావతిపై విషం చిమ్మాడు.. అక్కడి ప్రజలు చనిపోయే పరిస్థితి తీసుకు వచ్చాడు. అరాచక పాలనను తరిమి కొట్టి ప్రజలు ప్రజా పాలనకు మద్దతు ఇవ్వడంతో నేడు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు మళ్లీ దాన్ని గాడిలో పెట్టారు. నవరత్నాల పేరుతో ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గ, నీచమైన వ్యక్తి జగన్ రెడ్డి. ఇంత సంక్షోభంలో కూడా తన రాజకీయం అనుభవంతో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ.. సూపర్ సిక్స్ హామీలను అమలను చేస్తున్న నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనకు ఉండటం మన రాష్ట్ర అదృష్టం. బడుగు బలహీన వర్గాలను భయభ్రాంతులకు గురిచేయడం, వారిపై దాడులు చేయడం.. వారి రిజర్వేషన్లను తగ్గించడం, బడుగు బలహీన వర్గాల వారి భూములను కబ్జా చేయడం, బలహీన వర్గాల కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ కూడా దిక్కులేకుండా చేసి నిరుద్యోగులను మోసం చేశారు. నేడు 16 వేలకు పైగా ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన మంత్రి లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎక్కడ చూసినా విధ్వంసం, అరాచకం నుండి నేడు స్థిమితమైన ప్రజారంజక పాలనను తీసుకు వచ్చిన సంవత్సర కాల కూటమి పాలనను ఘనంగా ప్రజలందరూ జరుపుకోవాలని అనురాధ పిలుపు ఇచ్చారు.
వ్యవస్థలను గాడిలో పెడుతూ..: అశోక్బాబు
మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ గత పాలకులు వ్వస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారన్నారు. అటువంటి వ్వవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నాం.. ఒక రకంగా చెప్పాలంటే రోడ్లకు గుంతలు ఎలా పూడ్చామో..అలా ఆర్థిక, పరిపాలనా వ్యవస్థతో పాటు.. నేరస్థులు, అవినీతిపరులపై పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం. గత అరాచక పాలకుల చేతిలో గాయపడిన ఏపీకి అండగా కేంద్రం నిలబడటంతో.. నేడు పోలవరం, అమరావతి పనులు ఊపందుకున్నాయి. అవినీతి, అరాచకం తగ్గాయి. ప్రజలు ప్రశాంతంగా వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తాజాగా తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. దాదాపు 60 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే దీపం పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. త్వరలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించబోతున్నాం. అన్నదాతలకు భరోసా నిధులు వేయబోతున్నాం. కూటమి ప్రభుత్వం నినాదమే.. డెవలప్మెంట్, ఎంపవర్ మెంట్, ఎంప్లాయ్మెంట్. ఈ మూడిరటిని ప్రధాన అంశాలుగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం, పోలవరం పూర్తి చేసి, రాజధాని నిర్మాణంతో పాటు.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి.. రానున్న రోజుల్లో ఇంకా మంచి సుపరిపాలనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుపరిపాలనకు సహకరిస్తున్న ప్రజలకు అశోక్బాబు ధóన్యవాదాలు తెలియజేశారు. కేక్ కటింగ్ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పిల్లి మాణిక్యరావు, సీఆర్ రాజన్, టీడీపీ నాయకులు రమణ, బుచ్చిరాంప్రసాద్, ఈటె స్వామిదాసు, నజీర్, కోడూరి అఖిల్, బొద్దులూరి వెంకటేశ్వర్లు, ఎం. సత్యవాణి, కోనేరు దుర్గాదేవి, ఎస్పీ సాహెబ్, చప్పిడి రాజశేఖర్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.