విశాఖపట్నం (చైతన్య రథం): ప-పఱంఱశీఅ, I-Iఅఅశీఙa్ఱశీఅ, ్గ-్గవaశ్రీ, A-Aంజూఱతీa్ఱశీఅ, G-Gతీశీష్ష్ట్ర `అంటూ విశాఖకు కొత్త అర్థాన్నిస్తూ సీఎం చంద్రబాబునాయుడు అతిథులకు ఆహ్వానంతో కూడిన ట్వీట్ చేసి `సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కొత్త ఉత్సాహాన్నిచ్చారు. విశాఖ భవిష్యత్ `దార్శనికత. ఆవిష్కరణ. ఉత్సాహం. ఆశయం. వృద్ధిగా అభివర్ణించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక అనే అంశాన్ని ప్రతిబింబించేలా… రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు మొదలైంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అందరికీ అర్థమయ్యేలా… ఏపీలోని అపార అవకాశాలను వివరించేలా భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నాం. అందరి సహకారాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్కు విచ్చేసిన ప్రముఖులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను’’ అని పేర్కొన్నారు.














