- మార్చి 4 నుంచి ఐటీబీ బెర్లిన్-2025 సదస్సు
- అంతర్జాతీయంగా పెట్టుబడులు తీసుకొస్తాం
- ఏపీని ప్రపంచ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం
- త్వరలో మరో మూడుచోట్ల పర్యాటక సదస్సులు
- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
రాజమండ్రి(చైతన్యరథం): సుస్థిర, బాధ్యతాయుత, సమగ్ర, పర్యావరణహిత పర్యాట క విధానాలతో అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 4 నుంచి 6 వరకు మూడురోజుల పాటు జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్-2025 ఎక్స్పో సెంటర్ సిటీ వేదికగా సదస్సులో పాల్గొననున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. శనివారం రాజమండ్రిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జర్మనీ పర్యటన వివరాలు వెల్లడిరచారు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఏపీని ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు, వేగవంతమైన పర్యాటకా భివృద్ధికి జర్మనీ వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. తనతో పాటు ఎండీ ఆమ్రపాలి పాల్గొని పర్యాటక రంగంలో అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తామని పేర్కొ న్నారు. అడ్వెంచర్, కల్చర్, లగ్జరీ, మెడికల్, హెల్త్, ఎంఐసీఈ, టెక్నాలజీ, లగ్జరీ ట్రావె ల్, టూరిజం సెక్టార్లో ఉపాధి అవకాశాలు, ప్రపంచ గమ్యస్థానంగా స్థానిక ప్రాంతా లను ఎలా తీర్చిదిద్దాలి వంటి అంశాలకు మార్గదర్శకత్వంగా వేదిక నిలుస్తుందన్నారు. ప్రధానంగా సాంకేతిక పరివర్తన (డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్), సుస్థిర అభివృద్ధి, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, మార్కెట్ ట్రెండ్స్ ప్రధానాంశాలుగా ఈవెంట్ జరుగనుందని వివరించారు.
జర్మనీ వేదికగా వరుస సమావేశాలు
ప్రధానంగా 30 మందికి పైగా పెట్టుబడిదారులతో తనతో పాటు టూరిజం ఎండీ ఆమ్రపాలి ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతాం. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియాతో నిర్వహించే పత్రికా సమావేశంలో ప్రసం గించి అంతర్జాతీయంగా ఏపీ పర్యాటక రంగం గురించి తెలియజేస్తాం. అంతేగాక జర్మనీ లోని భారత రాయబారి హెచ్.ఈ.అజిత్ గుప్తే ఆధ్వర్యంలో అక్కడే నివాసముంటున్న ప్రవాస భారతీయులు, వివిధ అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య సంబంధిత వాటాదారు లతో కలిసి పర్యాటక రంగంలో ఏపీ ప్రత్యేకతను వివరిస్తాం. అత్యుత్తమ పర్యాటక గమ్య స్థానంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారు స్తామని వివరించారు. నూతన పర్యాటక పాలసీ, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా, పీపీపీ విధానం, కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలు వివరించనున్నాం. పర్యాటక, అతి థ్య రంగాల్లో కల్పించే మౌలిక సదుపాయాలు, ఎకో టూరిజంలో ఉన్న పెట్టుబడి అవకా శాలను హైలెట్ చేస్తాం. ఏపీని ఒకవైపు ఆహ్లాదం, మరో పక్క ఆదాయం ఇచ్చే ప్రాంతం గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. సదస్సు అనంతరం మరో రెండు రోజులు వివిధ ప్రాంతాల పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశమై పెట్టుబడులు ఆహ్వానిస్తామని వివరించారు. త్వరలోనే తిరుపతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో టూరిజం ఇన్వెస్టర్ల సమ్మిట్లు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
త్వరలోనే బీచ్లను అభివృద్ధి చేస్తాం
దేశంలో 7 బీచ్లు బ్లూఫాగ్ సర్టిఫికేషన్ పొందితే అందులో రాష్ట్రంలోని రుషికొండ బీచ్ ఒకటి. బ్లూఫాగ్ సర్టిఫికేషన్ పొందడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వస్తాయి. తద్వారా సరైన నిర్వహణతో బీచ్ పొడవునా పరిశుభ్రతకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇప్పటికే కాకినాడ, సూర్యలంక, నెల్లూ రులోని మైపాడ్, మచిలీపట్నం బీచ్లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్ల కోసం కృషి చేస్తున్నాం. తద్వారా ఆయా ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. టూరిజంతో పాటు ట్రావెల్ రంగం అభివృద్ధి కూడా ముఖ్యమని వివరిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని విమా నాశ్రయాలను పెంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు అనువుగా ఉంటుంది. పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు.
రాయితీలు మెచ్చి వెల్లువలా పెట్టుబడులు
ఒబెరాయ్, మేఫైర్, తాజ్ గ్రూప్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మెచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. ఎట్మాస్పియర్ గ్రూప్ వైజాగ్, తిరుపతిలో పెద్దఎత్తున హోటళ్లు, రూమ్స్ పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలోని హరిత రిసార్ట్స్ టాప్ క్లాస్ రిసార్ట్లుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. జిల్లా టూరిజం అభివృద్ధి కౌన్సిల్ ద్వారా కలెక్టర్, ఎంపీ, ప్రజాప్రతి నిధులు, తాను కలిసి కడి యం నర్సరీల దగ్గర రిసార్ట్లు నిర్మించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. పెట్టుబడి దారు లకు భూమి అవసరమైతే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చాలా పర్యాటక ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. సీఎం సూచనల మేరకు రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 50 వేల గదులు తయారయ్యేలా తాము అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి 5000 గదులు నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. పిచ్చు కలంకను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
నాడు వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం
గత ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్లపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు నాటి పర్యాటక మంత్రి పనిచేశారు. బూతుల గురించి చెప్పారు కానీ అద్భుతమైన సౌందర్యాలున్న ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడూ కృషి చేయలేదు. రుషికొండలో వైసీపీ నిర్మించిన అక్రమ ప్యాలెస్లపై ఏప్రిల్, మేలో నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. ఇప్పటికే గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులు మంజూరు అయ్యా యి. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళితే ఏప్రిల్ నుంచి రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత డీపీఆర్లు తయా రుచేసుకోమ ని కేంద్ర మంత్రి సూచించినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో విశాఖ, తిరుపతి, అమరావతి, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, కాకినాడలో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లకు మించిన ప్రకృతి సౌందర్యాలు ఇక్కడ ఉన్నా సరైన ప్రాచుర్యం లేక పర్యాటక రంగంలో వెనుకబడిరది. అసెంబ్లీ సమావేశాలు న్నప్పటికీ అంతర్జాతీయ వేదికపై పెట్టుబడులు ఆహ్వానించేందుకు ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు.