- ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీ-ఐఎఫ్సీ మధ్య ఒప్పందం
- దేశంలో ఐఎఫ్సీ రుణం పొందిన తొలి కార్పొరేషన్గా జీవీఎంసీ రికార్డ్
అమరావతి (చైతన్యరథం): విశాఖపట్నం పారిశుద్ధ్య రంగంలో ఒక కొత్త శకం మొదలైంది. విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎఫ్సీ) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సోమవారం ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడిరచారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలోని మధురవాడ జోన్`2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం రూ.553 కోట్లు వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టులో రూ.498 కోట్లు ఐఎఫ్సీ రుణంగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవీఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు వినియోగించనుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్సీకి చెల్లించనుంది.
15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతం (ఫ్లోటింగ్)గా నిర్ణయించారు. త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్గ్రౌండ్ మురుగునీటి నెట్వర్క్, ఆధునిక పంపింగ్ – లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం ` నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ చేయనున్నారు. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు. మధురవాడ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య మెరుగుదల, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, భూగర్భ జలాలు శభ్రపడతాయి. వరద నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర కోట్ల మందికి ఉపయోగకారిగా ఉంటుంది. నిర్మాణం, నిర్వహణ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో నగరాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి కొత్త దారి చూపినట్టయ్యింది.