- జీఎం నియామకంపై మంత్రి అచ్చెన్నాయుడు హర్షం
- త్వరలో గెజిట్ నోటిఫికేషన్కు కసరత్తు
- ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి కృతజ్ఞతలు
అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ ప్రజల చిరకాల స్వప్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు మరో ముందడుగు పడిరదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శర వేగంగా సాగుతోందన్నారు. అందులో భాగంగా రైల్వే జోన్కు తొలి జీఎం గా సందీప్ మాధుర్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం హర్షణీయమన్నారు. జోన్ ఏర్పాట్లు లో దీనిని అత్యంత కీలకమైన చర్యగా పేర్కొన్నారు. పరిపాలన అనుమతులు పనులు వేగవంతం అయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. రైల్వే జోన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగా రైల్వేజోన్ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జోన్ కార్యలయం ఏర్పాటుకకు అవసరమైన 54 ఎకరాల భూమి కేటాయించకుండా వైసీపీ పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు. దీనివల్ల ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని. ప్రస్తుతం రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ తిరిగి ప్రారంభమై వేగవంతంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇప్పటికే 54 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించారన్నారు. జోన్ ఏర్పాటుతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో పాటు రైల్వే ఆపరేషన్స్ సమర్థవంతంగా చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. విశాఖలోని ముడసర్లోవలో ఇప్పటికే స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. రూ 149 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీి వెళ్లిన ప్రతిసారీ ప్రధానమంత్రి , రైల్వే శాఖ మంత్రితో చర్చలు జరిపి రైల్వే జోన్ ఏర్పాటులో వేగం పెంచారు. గత 12 నెలల కాలంలో రూ.75 వేలకోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు, రూ.72 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధి చురుగ్గా సాగుతోంది. విశాఖ రైల్వే జోన్ పై గెజిట్ నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. దీనివలన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.