- సమన్వయంతో కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి
- 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యసాధనకు
- 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి
- కుప్పం మీదుగా మÖడు రాష్ట్రాలను కలుపుతూ
- బుల్లెట్ రైలు కారిడార్ను అభివృద్ధి చేయాలి
- దక్షిణాది రాష్ట్రాల మౌలికవసతులకు ప్రతిపాదనలు
- దక్షిణ గ్రిడ్ జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానం,
- సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ ఏర్పాటు చేయాలి
- ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్ఫోర్స్కు ప్రతిపాదన
- ఏపీ విభజన హామీల పరిష్కారంపై తక్షణ నిర్ణయం
- గోదావరి-కావేరి అనుసంధానంతో జలాల సద్వినియోగం
- 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో
- ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు, వినతులు
మహాబలిపురం/చెన్నై(చైతన్యరథం): రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించు కోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దక్షిణా ది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృ ద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణ భారత్ 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశం లో చర్చించారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం సాధించటమే లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు.
ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని వివ రించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అను సంధానం చేయడం, యూనివర్సిటీలు, ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ రాష్ట్రం ఒంటరిగా ఉండకుండా పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.
తిరుపతి నుంచి అయోధ్య వరకు తీర్ధయాత్ర సర్క్యూట్
దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యా త్మిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్థ యాత్ర సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మధురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్ ధామ్ ప్రాంతాల తో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాట కానికి ప్రోత్సాహం కల్పించే అవకాశం ఉంటుందని ప్రతిపాదన చేశారు. దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా ప్రస్తుతం 31 శాతంగా ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలి పారు. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్లు తమిళనాడు 2.6, కర్ణాటక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకు న్నాయని, సమష్టిగా దక్షిణ భారత్లోని రాష్ట్రాలన్నీ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని వివరించారు.
విభజన హామీల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశా లను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తికాలేదని పేర్కొన్నారు. ఆస్తులు, అప్పులు, సంస్థల విషయం లో సమ న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66 కింద ఉన్న అంశాలపై కేంద్ర నిర్ణయం కోసం గడచిన 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. విభజ న చట్టంలోని సెక్షన్ 56లోని సమస్యలు, వనరుల లోటు, ఆర్థిక భారానికి సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీ అభివృద్ధిలో కేంద్రం అందిస్తున్న సహకా రానికి కృతజ్ఞతలు తెలిపారు. హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఇప్పటికే ఏర్పాటు కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వేజోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నీటివనరులు, పచ్చదనం, జీవన ప్రమాణాలు, కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నూతన రాజధాని నిర్మాణం చేస్తున్నామని వివరించారు. చట్టంలోని షెడ్యూల్-13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. విశాఖ-చెన్నై పారిశ్రా మిక కారిడార్, మూడు విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రాజధా నికి రైలు అనుసంధానం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. దుగరాజపట్నం పోర్టు, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందా ల్ స్టీల్కు రైలు అనుసంధానంపై అనుమతులు మంజూరు చేయా లని విజ్ఞప్తి చేశారు.
నీటి భద్రతకు గోదావరి-కావేరి అనుసంధానం
భవిష్యత్ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కా రమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా వంటి 40 నదులు 28 జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నాయని తెలిపారు. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరి బేసిన్కు తరలించే ప్రతిపా దనను సీఎం కేంద్రం ముందు ఉంచారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదే శ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. గంగా-కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. గంగా నది మిగులు జలాల ను దక్షిణాది ప్రాంతాలకు తరలించడం ద్వారా తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభి స్తుందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల మధ్య సమన్వ యానికి ప్రత్యేక దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పా టు చేయాలని, డీపీఆర్లు, అనుమతులను కాలపరిమితిలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమష్టి అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సదరన్ జోనల్ కౌన్సిల్ పనిచేయాలని ఆకాంక్షించారు. కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని దక్షిణా ది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, కేరళ సీఎం వి.డి.సతీషన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెం ట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి సహా ఆయా రాష్ట్రాల ఉన్నతాధి కారులు హాజరయ్యారు.












