- దర్యాప్తులో గోల్డెన్ అవర్ కీలకం
- ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
- రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం
- ఇక నెల వారీగా పెర్ఫార్మెన్స్ రిపోర్టు ఇస్తాం
- పరామర్శల పేరుతో రోడ్లపై రచ్చతోనే ఇబ్బందులు
- 94 శాతం మంది ఒక పార్టీ నుంచే అరాచకాలు
- రాజకీయ ముసుగులో నేరాలపై కఠినంగా ఉండండి
- సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలి
- మహిళలు, చిన్నారులపై నేరాలను అదుపు చేయాలి
- బ్లేడ్, గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపాలి
- సైబర్ మోసాలు, డ్రగ్స్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలి
- శాంతిభద్రతలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం) మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని.. దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నేర నియంత్రణలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్ర సదివాలయం నుంచి డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా రేంజ్ బజీలు, డీఐజీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ దిశానిర్దేశం చేశారు. ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలని దానికి అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. నేరాలు దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెరగాలని సూచిం చారు, డీజీపీ నుంచి ఎసీహెచ్ వరకూ సమావేశం నిర్వహిం చటం ఇదే తొలిసారి. శాంతిభద్రతల విషయంలో లోటు పాట్లను సవరించుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఓ ప్రైడ్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఇంకా వ్యవహరించాలి. ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసింగ్ విధానం అమలు చేయాలి. గడచిన రెండేళ్లుగా కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం మేర తగ్గాయి. కాలాను గుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. డిజిటల్ క్రైమ్.. డిజిట ల్ అరెస్టులు తదితర నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా సాంకేతికతను పోలీసులు అందిపుచ్చు కోవాలని ఆదేశించారు.
పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం
2019-24 మధ్య ఉన్న పాలకులు గంజాయి, కల్తీ మద్యాన్ని ప్రధాన సమస్యగా తయారు చేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. గౌరవం పెరిగేలా చర్యలు చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా 14,770 పీసీ కెమెరాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసు కున్న కెమెరాలను కలిపి లక్ష కెమెరాలను అనుసంధానించాం. నేరాల దర్యాప్తులో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, డీఎన్ఏ డిటెక్షన్ లా ఆధునిక విధానాలు పెరిగాయి. వేగంగా నేరాలను గుర్తిండ గలుగుతున్నాం టెక్నాలజీ, నాలెడ్జ్, బెస్ట్ ప్రాక్టీసెస్ ను పోలీసు అధికారులు సమర్థంగా అమలు చేస్తే శాంతిభద్రతలు నియంత్ర ణలోకి వస్తాయి. రాజకీయ నేరాలు, డిజిటల్ రేరాలు, సోషల్ మీడియా ఇసభ్య పోస్టుల లాంటి నేరాలు పెరిగాయి. మహిళ లపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ అని పదేపదే గెలుతున్నాను. ఈ విషయంలో కరనంగా ఉండాల్సిందే.
నేరం జరిగిన ప్రాంతాన్ని సంరక్షించటంలో విఫలం కాకూడదు. నేర నియంత్ర ణకు పోలీసులూ గోల్డెన్ ఆవర్ విధానాన్ని పాటించాలి. తప్పు చేస్తే నేరస్తులు తప్పించుకోలేరని తెలిసేలా చేయాలి. వివేకా హత్య కేసు ఘటనలో పూర్తి సమాచారం రాలేదు. పోలీసుల వైపు నుంచి జరిగిన కాస్ట్ లీ మిస్టర్ అది. కొందరు కావాలనే తప్పు దోవ పట్టించారు. ఇల్లంతా రక్తం మరకలతో తరిస్తే ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఇది పూర్తి నిర్లక్ష్యం నేరస్తుల పట్ల ఉదాసీనంగా ఉండొద్దు. జీరో డ్రగ్స్, గంజాయి లేకుండా జాతీయ స్థాయిలో ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు రేసేందుకు ప్రయత్నాలు ఆరు గుతున్నాయి. మహిళల భద్రతతో పాటు గంజాయి, డ్రగ్స్ నియం త్రణ కోసం డ్రగ్స్ వద్దు బ్రో అన్న ప్రచారాన్ని విస్తృతం చేయండి. రహదారి భద్రత కూడా కీలకమైన అంశం. రోడ్డు ప్రమాణాల అరికట్టేలా సైనేజీలు, రోడ్ ఇంజనీరింగ్, హాట్ స్పాట్లను అడిట్ చేయాలి. వీటిపై ప్రజల్లో, అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించే లైసెన్స్ పార్టీలకు లేదు
శాంతిభద్రతల విషయంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు మనం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థపైనే మరక పడుతుంది. సింగయ్య వాహ నం కింద పడిపోయి. చనిపోతే కూడా ఎదురు ఆరోపణలు చేశారు. జగర్ కారు కింద పడిపోయినట్టుగా వీడియో వచ్చింది. కారు తొక్కేస్తే పొదల్లో పడేశారు. ప్రాణాలు కాపాడబోయిన పోలీసులపైనే దెవం పడింది. ఇబ్రహీంపట్నంలో రాజకీయ పార్టీ ర్యాలీలో రోడ్డుపై మోటారు సైకిల్ విద్యాసాలు ఏమిటి? పోలీసులపై కూడా దాడులు జరిగే పరిస్థితి ఉంది. ఏ పార్టీ అయినా రోడ్లుపై విద్యాసా లు చేసేందుకు అవకాశం! లేదు. ప్రజలకు అసౌకర్యం కలిగించ కుండా వెళ్లటం అన్ని పార్టీల బాధ్యత, రాజకీయ పార్టీ నేతలు కాబట్టి ఫ్రీగా వదిలేస్తామంటే శాంతిభద్రతల పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం వ్యవహరించే లైసెన్సు ఇవ్వలేదు. ప్రస్తుతం రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న వారిలో 94 శాతం మంది ఒక పార్టీ నుంచే ఉంటున్నారు. పరామర్శలకు వెళ్లటం తప్పేం కాదు. రోడ్లపై చేసే ప్రదర్శనల వల్లే ప్రజలకు ఇబ్బందులు. విశాఖపట్నంలో 3 గంటల పాటు రోడ్లను బ్లాక్ చేశారు. అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లే వారు, ఆఫీసుకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే సీఎంగా నేను కూడా వాహన కాన్వాయ్ కుదించుకున్నాను. మానసిక పరిస్థితి సరిగాలేని కొందరు వ్యక్తులు చేసే నేరాలపై ప్రజల్లోనూ చర్చ జరగాలి. కొందరు రౌడీలే. సామాజిక మాధ్యమాల్లో హీరోలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు.
నెలవారీ పోలీసు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్
శాంతిభద్రతల విషయంలో ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా ఉండాల స్నదే లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నేర నిర్ధారణ రేటు పెరిగితే నేరాలు తగ్గుతాయి. పోలీసులు దర్యాప్తు చేసి విజయం సాధించిన కేసుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధా నం పూర్తిస్థాయిలో అమలుకావాలి. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహిస్తున్నారు. గతంలో మద్యం తాగించేవారు, ఇప్పుడు గంజాయి మత్తులో వీరంగం చేస్తు న్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల సాయంతో నేరస్తులుగా మారుతున్నారు. టెక్నాలజీ నేరస్తులను పట్టిస్తోంది. అదే సమయం లో నేరాలు పెంచుతోంది. బ్యాలెన్సింగ్, ప్రాపర్ పోలిసింగ్ ఉండాలి. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం, సంఘ విద్రోహ శక్తు లకు భయం కలగాలి.
రాష్ట్ర అభివృద్ధితోపాటు శాంతి భద్రతలు కూడా కీలకం. అప్పుడే సుపరిపాలన సాధ్యం, డీజీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకూ పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…. ఇక నుంచి ప్రతీ నెలా పోలీసు పెర్ఫార్మెన్స్ రిపోర్టును విడుదల చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీస్ సహా వివిధ అంశాలను ప్రజలకు వివరిద్దామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1200 పోలీసు స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సహా శాంతిభద్రతలు, ట్రాఫిక్, జీఆర్పీ సహా వివిధ విభాగా లకు చెందిన 1650 మంది అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈసమావేశానికి హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్. మధుసూధనరెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లక్షా, ఈగల్ టాస్ట్ ఫోర్స్, బజీ రవికృష్ణ ఇతర ఉన్నతాధికారులు హాజర య్యారు..














