- నేడు సీఎం చంద్రబాబు చేతులమీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ వంతెనల ప్రారంభం
- భారీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
- అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల పరిశీలన
అమరావతి(చైతన్యరథం): ప్రజా రాజధాని అమరావతి ప్రగతిలో మరికొన్ని గంటల్లో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న ఇ-3 రెండో దశలో పూర్తయిన సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించను న్నారు. దీంతో రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం, సులభతరం కానున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునికి మౌలిక సదుపాయాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగుగా నిలవనుంది.
34 రహదారులు.. 350 కిలోమీటర్లు
అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ఎన్-సిరీస్ రహదారులను ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు అను సంధానించనుంది. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దిశల్లో గ్రిడ్ తరహాలో రహదారులను ప్రభుత్వం అభి వృద్ధి చేస్తోంది. అనవసర మలుపులు లేకుండా రాజధాని ప్రాం తంలోకి నేరుగా చేరుకునేలా ఈ రహదారి వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇ, ఎన్ సిరీస్ రోడ్లలో కలిపి 34 ప్రధాన రహదా రులు.. మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్లో పెరగనున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రవాణా వ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేస్తున్నారు.
మూడు దశల్లో రూ.1,519 కోట్లతో నిర్మాణం
దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఇ-3 రోడ్డు రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపా ల్ హాస్పిటల్స్ వద్ద ఎన్హెచ్-16ను కలుపుతుంది. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్లు వెచ్చిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ కారిడార్లో 9 లేన్ల రహదారి, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. డ్రైనేజీ, మంచినీటి సరఫ రా, గ్యాస్, విద్యుత్ నెట్వర్క్ కు అవసరమైన మౌలికవసతులను కూడా రహదారి నిర్మాణంతో పాటే కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్ లు, ఫుట్పాత్లు, గ్రీన్బెర్ట్లతో ఇ-3ను ఆధునిక నగర రహదారి గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.
బకింగ్ హామ్ కెనాల్పై ఉక్కు వంతెన
ఇ-3 రోడ్డును విజయవాడ-మంగళగిరి హైవేతో అనుసంధా నించేందుకు బకింగ్హామ్ కెనాల్పై రూ.82 కోట్లతో 478 మీట ర్ల పొడవున నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. దీనిని కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని నిర్మించింది. దీనిని కూడా ప్రారంభించనున్నారు. వంతెనలు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలకు మెరుగైన మార్గం ఏర్పడుతుంది, కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ.. వాహనాలు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే అవకాశం కలుగుతుంది. రాజ ధాని అమరావతి పునర్నిర్మాణంలో రహదారుల అభివృద్ధికి అత్యధి క ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. మౌలికవసతులను వేగంగా పూర్తి చేస్తోంది. సీఎం చంద్రబాబు చేతులమీదుగా ఇ-3 యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభం కానుండటంతో అమరావతి పున ర్నిర్మాణ వేగానికి మరో కీలక సంకేతంగా నిలవనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు
ఉదయం 10.20 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. 10.35 గంటలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తారు. 10.45 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ప్రయాణించి రాయపూడికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 01.25 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 06.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.













