అమరావతి (చైతన్య రథం): ఆతీయ నేస్తం స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మృతినివాళి అర్పించారు. ఎర్రంనాయుడి వర్థంతి సందర్భంగా ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డడిగా, ఉన్నత విలువలకు ప్రతిరూపంగా, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. ఉత్తమ పార్లమెంటేరియన్గా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం, నా ఆత్మీయ నేస్తం స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నా’’ అని పేర్కొన్నారు.














