- దేశం గౌరవించదగ్గ వ్యక్తి రాధాకృష్ణన్
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం
ఢిల్లీ (చైతన్య రథం): దేశం గౌరవించదగిన వ్యక్తి ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోవున్న సీఎం చంద్రబాబు శుక్రవారం సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఆయనకు మా మద్దతు ఉంటుందని చెబుతూ అభినందనలు తెలిపాను. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ గౌరవం తీసుకొస్తారు. ఎన్నికల ముందు నుంచీ ఎన్డీయేలో తెదేపా ఉంది. ఆ అభ్యర్థికే మా మద్దతు ఉంటుంది. తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అవకాశం ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం?’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.