- విదేశీ విద్య లబ్ధిదారులు సహకరించాలి
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 మోడల్లో వెనుకబడిన తరగతుల హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకు దాతలు, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద లబ్ధి పొంది ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థుల సాయం తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. మార్గదర్శులు, బంగారు కుటుంబాల పేరుతో ఎంతో సదుద్దేశంతో రూపొందిం చిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, బీసీ హాస్టళ్ల అభి వృద్ధికి సహకారమందించాలని ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథ కం విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రజా భాగస్వామ్యంతో హాస్టళ్ల నిర్వహణ
ప్రభుత్వపరంగా బీసీ హాస్టళ్ల మెరుగుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. సకాలంలో డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తుం దన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నా మని వివరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేశామన్నారు. తల్లికి వందనం పథకం ఇంట్లో ఎందరు విద్యార్థులు ఉంటే అందరికీ రూ.13 వేల చొప్పున అందజేసినట్లు చెప్పారు. బీసీ హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలా బీసీ బిడ్డలకు నాణ్యమైన భోజనం పాటు భద్రతతో కూడిన విద్యను అందిస్తున్నామని వివరించారు. అదే సమయంలో సా మాజిక సేవపై ఆసక్తి కలిగిన దాతల సాయంతో పేద విద్యార్థు లకు స్వల్ప కాలంలో మెరుగైన సౌకర్యాలు అందించగలుగుతా మన్నారు. పీ-4 విధానంలో ప్రజల భాగస్వామ్యంతో హాస్టళ్ల నిర్వహణ మరింత సులభంగా మారుతుందని తెలిపారు.
ఈ మెయిళ్లతో సంప్రదింపులు
కార్పొరేట్కు ధీటుగా బీసీ హాస్టళ్లలో విద్య అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం విద్యార్థులు తమకు తోచినరీతిలో బీసీ హాస్టళ్లకు అండగా ఉండాలని కోరారు. ఈ మేరకు వారితో ఈ మెయిళ్ల ద్వారా సంప్రదించినట్లు వెల్లడిరచారు. ఏదైనా హాస్టల్ను దత్తత తీసుకోవచ్చునన్నారు. ఒకరిద్దరు విద్యార్థులను దత్తత తీసు కుని, వారి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించాలని సూచించారు. తమ స్థాయికి తగిన రీతిలో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్, మరమ్మతులు, ఆర్వో ప్లాంట్లు, విద్యుత్ సదుపాయం కోసం సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. దాతలు అదనపు వసతుల గదుల నిర్మాణంతో పాటు లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయవచ్చునన్నారు.
ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వవచ్చని వివరించారు. హాస్టళ్ల పరిసరాల సుందరీకరణకు దాతలు ముందుకు రావాలని కోరారు. నిర్మాణాలు, మెటీరియళ్లపై దాతల పేర్లు ప్రచురిస్తామని, దీనివల్ల మరింతమంది స్ఫూర్తి పొందడానికి అవకాశం కలుగు తుందని తెలిపారు. సామాజిక సేవపై ఆసక్తి కలిగి పేద బీసీ విద్యార్థులకు అండగా నిలవాలనుకున్న వారు సఱతీవష్శీతీ aజూపష షవశ్రీటaతీవఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్ లేదా 6300876401, 7989344521 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం విద్యార్థులకు పిలుపునిచ్చారు.