- సేవల విస్తరణకు సత్వర నియామకాలు
- వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా రాష్ట్రంలో ఆయుష్ సేవలను విస్తృతం చేయడానికి కూటమి ప్రభు త్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ విభాగంలో 358 మంది వైద్యు లు, ఇతర సిబ్బందిని వెంటనే నియమించడానికి ప్రభుత్వం నిర్ణ యించింది. 71 మంది డాక్టర్లు, 26 మంది జిల్లా ప్రోగ్రాం మేనేజ ర్లు, 90 మంది పంచకర్మ థెరపిస్టులతో పాటు మొత్తం 358 మందిని సత్వరమే నియమించడానికి వైద్య ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో ఆయుష్ సేవలపై కేలవం రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. దీనికి భిన్నంగా మంత్రి చొరవతో 2024-25 సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం రూ.83 కోట్లు మంజూరు చేసింది. 2024-25 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన స్టేట్ యానువల్ యాక్షన్ ప్లాన్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరా నికి రాష్ట్రంలో ఆయుష్ మిషన్ కింద రూ.250 కోట్ల మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ స్థాయిలో ఆయుష్ సేవల విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో సిబ్బంది కొర తపై మంత్రి సమీక్షించి తక్షణమే 358 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆయుష్ సేవలు అందించేందుకు 71 మంది డాక్టర్లను, 26 మంది జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు, సహాయక సిబ్బంది, 90 మంది పంచకర్మ థెరపిస్టులతో పాటు ఇతర సిబ్బందిని నియమించ నున్నారు. వీరిని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వైద్య సేవల నియామకాల మండలి ద్వారా ఎంపిక చేస్తారు. మద్యానికి బాని సలైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ముగ్గురు సైక్రియాటిస్టు లను కూడా నియమిస్తారు.