- అంతకుముందు పార్టీ ఎమ్మెల్సీలతో విస్తృత చర్చ
పార్వతీపురం (చైతన్యరథం): ఉపాధ్యాయుల బదిలీల్లో ఎస్జీటీలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం సోమవారం ప్రజా ప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్తో ఎస్జీటీ కౌన్సిలింగ్పై చర్చించామన్నారు. బదిలీల కౌన్సిలింగ్పై ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేశారన్నారు. అన్ని విషయాలు పరిశీలించిన మీదట, ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.