అమరావతి (చైతన్యరథం): త్యాగం, అనురాగం, దాన గుణాలను పెంపొందించే పండుగ ఈద్ అల్ అదా (బక్రీద్) సందర్భంగా అందరికీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. నిస్వార్థమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింపజేయడమే బక్రీద్ పండుగ ముఖ్యోద్దేశం అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుందామన్నారు.