అమరావతి (చైతన్యరథం): టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతిపట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలందించారని గుర్తు చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారన్నారు. సౌమ్యుడిగా పేరుగాంచిన పల్లా సింహాచలం శాసనసభ్యుడిగా ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పల్లా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.