- బీచ్ ఫెస్టివల్ విజయం సంతోషంగా ఉంది
- బందరు పర్యాటకం చాటి చెప్పడమే లక్ష్యం
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు కోసం శ్రమిస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఇలాంటి జన సునామీ చూస్తుం టే చాలా సంతోషంగా ఉంది.. దేశంలో ఏ బీచ్లో కూడా ఇలాంటి ఫెస్ట్ జరగలేదు..ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు.. బందరు పర్యాటక అవకాశా లను ప్రపంచానికి చాటి చెప్పడమే నా లక్ష్యమన్నారు. రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. 2014-19 మధ్య బందరులో ఉన్న పర్యాటక అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని అను కు న్నాం.. సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలకు పర్యాటకమే ఆధారం..మన రాష్ట్రం లో కూడా అద్భుతమైన అవకాశాలున్నాయి. పోరాటంతో సాధించుకున్న పోర్టును జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. పల్లె తుమ్మలపాలెంలో క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తద్వారా ఇక్కడి నుంచి వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తప్పుడు కేసుతో తనను 53 రోజులు పాటు రాజమండ్రి జైల్లో పెట్టినపుడు బాధపడ్డా.. నిద్రలేని రాత్రులు గడిపా.. బందరు ప్రజలు ఇచ్చిన పునర్జన్మతో మళ్లీ ఈ రోజు మీ ముందు నిలబడ్డా.. నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు అభివృద్ధి కోసం శ్రమి స్తా.. ప్రజల సహకారంతో బందరు అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. బందరు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ఉపాధికి కేంద్రంగా మారుస్తా. బీచ్ ఫెస్ట్ కోసం నెల రోజుల నుండి శ్రమించిన అధికారులందరికీ ధన్యవాదాలు. అర్ధరాత్రు లు శ్రమించి పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న పారిశ్రామిక సిబ్బందికి ధన్య వాదాలు.. పోలీస్, రెవెన్యూ సహా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించిన ప్రతిఒక్కరికీ పాదాభివందనం తెలిపారు.
గత ప్రభుత్వం పట్టించుకోలేదు: అనగాని
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎప్పూడూ ఎక్కడ ఇలాంటి వేడుక నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వం హయాంలో పులికాట్లో ఫ్లెమింగో ఫెస్టివల్, మంగినపూడిలో మసులా బీచ్ పం డుగను పట్టించుకోలేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాకే ఈ రెండు ఉత్సవాలు ఘనం గా నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులే కాదు.. పక్షులు.. పర్యాటకు లు కూడా పారిపోయాయని విమర్శించారు. మన ప్రాంతంలో టూరి జంను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ కబడ్డీ, వాలీ బాల్లు ఈ ప్రాంతంలో జరిపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మంచి సంకల్పం తో మంత్రి రవీంద్ర చేసిన ప్రయత్నాన్ని మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారన్నారు.. అందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా.. మచిలీపట్నం అభివృద్ధి చేయాలని కొన్నేళ్లుగా రవీంద్ర, మేము పాటు పడుతున్నామని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ బందరు అభివృద్ధికి ఎంతో కాలంగా పనిచేస్తున్నామ న్నారు. బీచ్ కళకళలాడే విధంగా చేయాలన్న కోరిక నెరవేరే వరకు కృషి చేస్తామ న్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కృషి, ముఖ్యమంత్రి సహకారంతో కృషితో పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు బండి రామక్రిష్ణ, వీరంకి గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.