- ఆ ప్రాంత మహిళలపై వ్యాఖ్యలు నీచం
- రాజధాని అంటేనే జగన్కు అక్కసు
- హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అక్కడి రైతులు 1630 రోజులు అందోళనలు చేశా రని గుర్తుచేశారు. ఇందులో 270 మంది చనిపోయారన్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో తిరుపతికి పాద యాత్ర చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల పాద యాత్ర సమయంలో అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. అమరావతి మహిళలపై హీనంగా మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. ‘‘అమరావతిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.77,200 కోట్లతో పనులు జరుగుతు న్నాయి. ఇప్పటికే రూ.49 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచా రు. భారతీరెడ్డి గురించి తప్పుగా మాట్లాడారని మా పార్టీ సాను భూతిపరుడైనా కిరణ్ను అరెస్టు చేసి మహిళల పట్ల గౌరవాన్ని చాటుకున్నాం. రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్లడం చూసి వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. రాష్ట్ర గౌరవానికి భంగం వాటిల్లేలా సాక్షి ఛానల్లో మాట్లాడారు. అమరావతిపై వ్యాఖ్యలను వైసీపీ నేతలూ హర్షించకూడదు. అమరావతి అంటే జగన్కు మొదటి నుంచీ అక్కసు ఉంది’’ అని మండిపడ్డారు.