అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఒక ప్రకటనలో ఖండిరచారు. ‘‘అమరా వతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారు. అమరావతిలో విలసిల్లిన బౌద్ధాన్ని అవహేళన చేశారు. ఆ ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను విస్మరించవద్దు. రాజధా ని అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14 శాతం బీసీలు ఉన్నారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. విశ్లేషకుడి ముసుగులో చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉంది. ఇలాంటి కుట్రలను ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలి. రాజధానిని, అక్కడి మహిళలను అవమానించేందుకు కుటిల యత్నం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.