అమరావతి (చైతన్యరథం): చల్లపల్లి రాజా కుమారుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ మృతిపట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో అంకినీడు ప్రసాద్ విశేష సేవలు అందించారన్నారు. చల్లపల్లిలోని ఎస్సార్ వైఎస్పీ జూనియర్ కళాశాల కరస్పాడెంట్గా పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేశారు. జమిందారు వ్యవస్థలో ప్రజలకు అన్ని విధాలా అండగా నిలిచిన చరిత్ర చల్లపల్లి జమిందారు వంశీయుల సొంతం. మోపిదేవి, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, యార్లగడ్డ, శివగంగ ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన మరణం చల్లపల్లి ప్రాంతానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.