అమరావతి (చైతన్యరథం): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజవాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందచేశారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.