- సాక్షి పత్రికలో స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరం
- శాసనసభలో విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): చట్టసభలు చూస్తూ పెరిగినవాడ్ని. చిన్నవయసులో చట్టసభలను చూశాను. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ… చట్టసభల్లో ఇది నాకు రెండో అవకాశం. తొలిసారి శాసనసభకు వచ్చా. ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత చూపకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రబ్ చేసి వెళ్లారు. గతంలో మేం నిరసన తెలియజేసినపుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశాం. పోడియం వద్దకు రాలేదు. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదు. నేను అసెంబ్లీలో కొత్త మెంబర్ని. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉంది. అసెంబ్లీ కండీషన్స్ ఫర్ రికగ్నిషన్లో కూడా ఈ విషయం పొందుపర్చారు. జగన్మోహన్రెడ్డి 13, జూన్, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ… చంద్రబాబుకు 23మంది సభ్యులున్నారు. 5గుర్ని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదని సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువు తగ్గిస్తుంది. సాక్షి పత్రికలో తప్పుడు రాతలు బాధాకరం. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉంది. జగన్మోహన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్పైన రుద్దడం బాధాకారం. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ అన్నారు.