- ఐదేళ్లలో 9 సార్లు పెంచిన ఘనత జగన్దే
- అరాచక పాలనతో ఆ రంగాన్ని నాశనం చేశారు
- రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపారు
- విద్యుత్ సంస్థల నిధులూ బేవరేజెస్కు మళ్లించారు
- ఛార్జీల పెంపుపై మాట్లాడే అర్హత వారికి లేదు
- 65 శాతం విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించాం
- తమ ప్రభుత్వంలో మిగులు విద్యుత్గా నిలిపాం
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలను ఇప్పటివరకు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశా రు. భవిష్యత్తులో కూడా పెంపు ఉండబోదని శాసన మండలి సాక్షిగా ప్రకటించారు. మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు శివరామిరెడ్డి, అరుణ్ కుమార్, రవిబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన తీరును సభకు వివరిం చారు. తద్వారా వైసీపీ నేతలు చేస్తున్న సత్యదూరమైన ఆరోపణలను తిప్పి కొట్టారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులకు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చివరి రెండేళ్ల పాలనలో ప్రజలపై రూ.15,000 కోట్ల విద్యుత్ భారం మోపిన విషయాన్ని గుర్తుచేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.8,113 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలను పెంచి ఈఆర్సీకి పంపిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా మరో రూ.11,000 కోట్లు పెంపుపై ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా, దానిని దాదాపు 20 నెలల కాలా నికి సాగదీసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనలతో పెరిగిన రూ. 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని కూటమి ప్రభుత్వంపై మోపేలా ప్రజలను మభ్య పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచిన వాళ్లే రోడ్లెక్కి ధర్నాలు చేయడం, ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా..
రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ విద్యుత్ ఉత్పత్తి పరంగా అనేక అవాంతరాలు ఎదుర్కొందని తెలిపారు. 2014లో అధికారం చేపట్టిన టీడీపీ విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందని పేర్కొన్నారు. 2014 – 2019 మధ్య కాలంలో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని వివరించారు. 2019 ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో విద్యుత్ రంగ అభివృ ద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ విద్యుత్ రం గాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కృష్ణపట్నం రెండో ఫేజ్, ఇబ్రహీపట్నం వీటీపీ ఎస్ ఐదో ఫేజ్ ప్లాంట్లను షట్డౌన్ చేయించి ఉత్పత్తిని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజె క్ట్ 2019 సమయానికి 70 శాతం పూర్తయినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో మిగి లిన 30 శాతం పూర్తి చేయలేదని చెప్పారు. అంతేకాకుండా కొత్త పవర్ ప్లాంట్ల నిర్మా ణాలు లేకుండా చేశారని ఆరోపించారు. పునరుత్పాదక విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం సోలార్, విండ్ ఉత్పత్తిని కూడా ఆపేసిన విషయాన్ని గుర్తుచేశారు. షార్ట్ టైం పవర్ పర్చేజ్ల పేరుతో సుమారు రూ.10,000 కోట్లతో విద్యుత్ కొనుగోళ్ల చేసి ఆ భారం ప్రజలపై వేశారని మంత్రి వెల్లడిరచారు. విద్యుత్ సంస్థల నిధులను కూడా బేవ రేజెస్ కార్పొరేషన్కు మళ్లించిన ఘనత జగన్కే దక్కిందని ఎద్దేవా చేశారు.
జగన్ లేఖతో రాష్ట్రానికి అపార నష్టం
అడ్డగోలు విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర ఖజానాపై భారం మోపడమే కాకుండా పీఎం కుసుమ్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్కు వద్దంటూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం జగన్రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతుందని విమర్శించారు. పీపీఏలను రద్దు చేయ డమే కాకుండా ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని తెలిపారు. పెట్టుబడిదా రులను రాష్ట్రం నుంచి తరిమేశారని వాపోయారు. అంతేకాకుండా విదేశీ ప్రతినిధులతో తిట్లు కూడా తిన్నారని ఎద్దేవా చేశారు. ఇవేమీ బయటపడకుండా… సత్యదూరమైన మాటలతో కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. 2014 -19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలను పెంచ లేదని, ఇకపైనా పెంచబోమని మరోసారి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జెన్కో ద్వారా నాణ్యమైన విద్యుత్ను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర సహకారంతో రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 65 శాతం విద్యుత్ కొనుగోళ్లను తగ్గించా మని సభాముఖంగా తెలిపారు. జెన్కోను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నా మని తెలిపారు. ఉత్పత్తి అయిన విద్యుత్ నిరుపయోగం కాకుండా కేంద్ర ప్రభుత్వ సహా య, సహకారాలతో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థను తీసుకొస్తున్నామని వెల్లడిరచారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పీఎం కుసుమ్ పథకం కావాలంటూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని వివరించారు. కుసుమ్ పథకం ద్వారా ఇప్పటికే లక్ష కనెక్షన్లు తీసుకున్నామని…మరో రెండు లక్షల కనెక్షన్లకూ అనుమ తులు మంజూరయ్యాయని వివరించారు. పీఎం కుసుమ్ సహకారంతో రైతులకు పగటి సమయంలోనే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తు న్నామని పేర్కొన్నారు.