- బడ్టెట్లో రైతులకు, బీసీలకు పెద్దపీట
- జూన్ నుంచి మరో రెండు పథకాలు
- ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం
- జగన్లా మాట తప్పే నైజం కాదు
- తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ(చైతన్యరథం) ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి తీరుతామని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. అన్నదాత పథకాన్ని కూడా జూన్లోనే అమలు చేయ నున్నట్లు తెలిపారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శనివారం సోమందేపల్లి మండలం మాగెచెరువులో ఎన్నికలల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రూ.12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు విద్యార్థులుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత ఇసుక, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నాం. వచ్చే జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడిరచారు. తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ ఇస్తాం. జగన్లా తమ నాయకుడు మాట తప్పే మనిషి కాదు. అమ్మఒడి పేరుతో స్కూల్కు వెళ్లే విద్యార్థులందరికీ సాయమందిస్తామని చెప్పి తల్లులను జగన్ మోసం చేశాడని విమర్శించారు. కేవలం ఇంటిలో ఒకరికి మాత్ర మే అమ్మఒడి పథకం వర్తింపజేశారని గుర్తుచేశారు.
త్వరలో రేషన్కార్డులు, ఆటోలు, కుట్టుమిషన్లు
త్వరలో నూతన రేషన్కార్డులు అందజేయనున్నట్లు వెల్లడిరచారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆర్థికసాయం అందిస్తామని, కొత్తగా నిర్మాణాలు కూడా చేప ట్టనున్నామని తెలిపారు. త్వరలో నిరుద్యోగ యువతకు ఆటోలు కూడా పంపిణీ చేయ నున్నట్లు తెలిపారు. వాటితో పాటు డెయిరీ, ఇతర యూనిట్లు కూడా నెలకొల్పనున్నట్లు వెల్లడిరచారు. 2024-25కు సంబంధించి కొంతమందికి ఇప్పటికే స్వయం ఉపాధి యూనిట్లు కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతన లబ్ధిదారులతో యూనిట్లు నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 85 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పెనుకొండ నియోజకవర్గంలోనూ పంపిణీ చేయనున్నామని చెప్పారు. సోమందేపల్లిలో టైలరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని, మహిళలంతా పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు.
బడ్జెట్లో రైతులకు, బీసీలకు పెద్దపీట
బడ్జెట్లో రైతులకు, బీసీలకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రూ.3,22,359 కోట్లు భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నా రు. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాల కోసం భారీఎత్తున నిధులు కేటాయించినట్లు చెప్పారు. పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, తల్లికి వందనం అమలుకు రూ.9,407 కోట్లు, వ్యవసాయానికి రూ.48,340 కోట్లు కేటాయించారు. రైతులతో పాటు బీసీలకూ బడ్జెట్లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా బీసీలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేటాయింపులు చేశారని వివరించారు.
ప్రజలను మోసగించిన జగన్
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రాయలసీమలో ఒక్క సాగునీ టి ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, కనీసం కాలువల్లో తట్ట మట్టి కూడా వేయలేదని మంత్రి సవిత మండిపడ్డారు. సీపీఎస్ రద్దు అంటూ సీపీఎస్ ఉద్యోగులను, మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను జగన్ వంచించారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా మార్చాలని రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే హంద్రీనీవా రెండో దశ పనులు మొదలయ్యాయి. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
మాగెచెరువు నాకు మెట్టినిల్లు
రాంపురం పుట్టినిల్లయితే..మాగెచెరువు తనకు మెట్టినిల్లు అని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయకపోయినా మాగెచెరువు వాసులు తనకు అత్యధిక మెజార్టీ కట్టబెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ గ్రామంలో రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించినట్లు వెల్లడిరచారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టంచేశారు. నూతన సీసీ రోడ్లు, కాలువలతో వాటర్ ట్యాంకు నిర్మాణా నికి కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, నూతన ఇళ్లు అందజేస్తామని వెల్లడిరచారు.
చేసిన తప్పులకు శిక్షలు తప్పవు
చట్టవిరుద్ధంగా ఎవరు వ్యవహరించినా శిక్ష తప్పదని తెలిపారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు తావేలేదు. జగన్ హయాంలో వైసీపీ మూకలు బరితెగించి రాజ్యాం గాన్ని అతిక్రమించి దౌర్జన్యాలకు, దారుణాలకు ఒడిగట్టారు. మహిళలపై వేధింపులకు దిగారు. వారందరూ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చట్టం తన పని తాను చేసు కుపోతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును, తనతో సహా మంత్రులు అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్రను, స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు మరెందరో టీడీపీ నాయ కులపై తప్పుడు కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధించలేదా? అని ప్రశ్నించారు.
నేటి జాబ్మేళాను సద్వినియోగం చేసుకోండి
పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించనున్న ఇండి యన్ డిజైన్స్ జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. ఈ జాబ్మేళాలో ఎంపికైన వారికి టైలరింగ్లో శిక్షణ ఇచ్చి రూ.13 వేల జీతంతో పాటు ఇంటెన్సివ్ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. యువతతో పాటు మహిళలు కూడా ఈ జాబ్ మేళాను వినియోగించుకోవాలని కోరారు.