- స్పోర్ట్స్ సిటీ అభివృద్ధిపై చర్చ
- వివరాలను ఎక్స్లో పోస్టు చేసిన చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): 2029లో జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చేందుకు ఆవలాశం కల్పించాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషను కోరినట్టు సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. గురువారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబును భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష గౌరవసూచకంగా కలిశారు. ఉషతో క్రీడాంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా వివరాలను పోస్టు చేస్తూ.. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రానికి స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకొచ్చే విషయంలో ఆమె మద్దతు కోరినట్లు వెల్లడిరచారు. అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేసే ప్రణాళికలపైనా చర్చించామన్నారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు అత్యుత్తమ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్లో స్పష్టం చేశారు.