- ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు
- మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి
గుంటూరు (చైతన్యరథం): రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలకు వీలైనంత త్వరగా కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సబ్రిజిస్ట్రార్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశం ఆదివారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనగాని.. డైరీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయాల సిబ్బందితో భర్తీ చేయిస్తామని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను మంత్రి సత్య ప్రసాద్ కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కాగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.