అమరావతి (చైతన్య రథం): స్వర్ణాంధ్ర విజన్ సాధనకు ప్రతి శాఖ నిర్దుష్టమైన టార్గెట్తో ముందుకెళ్లాలని, ప్రతి ఐఏఎస్ అధకారీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడే నిర్దుష్టమైన, స్పష్టమైన సమాచారం అధికారులకు అందుతుంధని, అధికారులంతా గ్రామస్థాయికి వెళ్లి పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో మంగళవారం సుదీర్ఘంగా నిర్వహించిన వర్క్షాప్ ముగింపులో సీపం చంద్రబాబు మాట్లాడుతూ.. ఫైళ్లు ఆన్లైన్ విధానంలోకి వచ్చాక క్లియరెన్స్కు ఎక్కువ సమయం పట్టకూడదన్నారు. ఆర్థికేతర ఫైళ్లు వెంటనే క్లియర్ చేయాలని, నెలాఖరకు ఎవరి దగ్గరా ఫైళ్లు పెండిరగ్ ఉండకూడదని ఆదేశించారు. జీఎస్డీపీలో 15 శాతం వృద్ధి రేటు సాధించగలిగితేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని అంటూ.. ఆ దిశగా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలన్నారు. గ్రీవెన్స్ ఏ శాఖలో, ఏ విభాగంలో ఎక్కువ వస్తే ఆ విభాగం సరిగా పని చేయనట్టు లెక్క అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రెవెన్యూ విభాగంలో అర్జీలు ఎక్కువ వస్తున్నాయని, దీనికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమన్నారు. ప్రజల సంతృప్తిస్థాయిని అన్ని అవకాశాల ద్వారా పెంచాలని చంద్రబాబు అంటూ.. ప్రజామోదయోగ్యంగా పాలన సాగించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ కర్మయోగి ద్వారా శిక్షణనిస్తే పనితీరు మెరుగవుతుందని అంటూ.. వాట్సాప్ గవర్నెన్స్లోనూ అందరూ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి అన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ ప్రకారం ప్రతి శాఖ నిర్దుష్టమైన టార్గెట్తో ముందుకెళ్లాలని, ప్రతి ఐఏఎస్ అధకారీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అందుకు తగిన గైడ్లైన్స్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. మార్చిలోపు కేంద్రంనుంచి ఎంత నిధులు రాబట్టుకోవచ్చో అన్నీ రాబట్టుకోవాలని, ఉగాది రోజున పీ`4 కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. హ్యాపీ సండే కూడా ప్రారంభిస్తామని, మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అంటూ.. దీనికి గైడ్లైన్స్ రూపొందించాల్సి ఉందన్నారు. మనం చేసే మంచి పనులతోనే సంతోషం కలుగుతుందని, కష్టపడి పని చేసినందువల్ల చాలా విభాగాల్లో ఫలితాలు కనబడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.