- ప్రపంచంలో పేరున్న పరిశ్రమలు తీసుకొస్తున్నాం
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కేరాఫ్గా ఆంధ్రప్రదేశ్
- 26 పాలసీలతో వేగంగా పెట్టుబడులకు అనుమతులు
- తొలిసారి యూనివర్సల్ హెల్త్ పాలసీతో వైద్యసేవలు
- విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలు
- అతిథిదేవోభవ..అదే మన పర్యాటక విధానం
- గత ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమేశారు
- నేడు పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటూ దుష్ప్రచారం
- మెడికల్ కాలేజీలకు భూమి కూడా చూపించలేకపోయారు
- పీపీపీ విధానం అంటే ప్రైవేట్ కాదు..ప్రభుత్వ ఆస్తి
- నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు
- ఎక్సైజ్లో కుంభకోణంపై విచారణ జరుగుతోంది
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించా మని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఎంఎసఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్ర మల్లో 95 వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. మెగా డీఎస్సీ, పోలీసు కాని స్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 30,500 కల్పించామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పించి హామీని నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా నియమించామని తెలిపారు. పెట్టుబడులు, మౌలిక సదు పాయాలు, ఐటీ, ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగా లపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
గత పాలనలో యువత పొరుగు రాష్ట్రాలకు వలసపోయింది
2019-24 మధ్య ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. జాకీ, అమర్ రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయాయి. వైసీపీ ఉన్నంతవరకూ ఏపీకి తిరిగి రామని చెప్పి మరీ ఆ కంపెనీలు వెళ్లిపోయాయి. పూర్తిగా నెగెటివ్ ఇమేజ్ని సృష్టించి గత పాలకులు వెళ్లారు. 2019-20 నుంచి 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 913 కంపెనీలు మూతపడి నట్టు ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిరునామా ఏపీ ఉండేది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కేరాఫ్ అడ్రస్గా ఏపీ ఉంది. 26 పాలసీలతో వేగంగా పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నాం. పర్యాటకానికి పారిశ్రా మిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పారిశ్రా మిక ప్రోత్సాహకాలను కూడా రూ.210 కోట్ల మేర విడుదల చేశాం. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటిద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. విశాఖ, అమరావ తి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు అభివృద్ధి చేస్తున్నాం. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ తయారవుతుంది. విశాఖ ఐటీ, జీసీసీల కేంద్రంగా తయారవుతుంది. ఎవరూ ఊహించనన్ని పెట్టుబడులు విశాఖకు వచ్చాయని వివరించారు.
పేరున్న పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి
అమరావతికి క్వాంటం లాంటి ఎకోసిస్టం వస్తోంది. తిరుపతిని కూడా స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్సు పరిశ్రమలతో అభివృద్ధి చేస్తాం. గూగుల్, టాటా-టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చా యి. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వస్తోంది. 20 నెలల్లోనే ప్రపంచంలోనే పేరున్న పరిశ్రమలు కంపెనీలు ఏపీకి వచ్చాయి. ఈ నెలలో ఆర్సెలార్ మిట్టల్, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయబోతున్నాం. ఏఎం గ్రీన్ ద్వారా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి కూడా శ్రీకారం చుట్టాం. ఎన్టీపీసీ ద్వారా 1.85 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ తయారీ కోసం కూడా ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. టాటా సంస్థ కూడా రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ఇలా ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో ఈ పెట్టుబడులను సుస్థిరం చేయడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయాలని నిర్ణ యించాం. గత ప్రభుత్వంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలస పోయిన పరిస్థితి. పెట్టుబడులకు ప్రిఫర్డ్ డెస్టినేషన్గా ఏపీ మారు తుంది. ఎన్డీఏ పాలన ఉన్నంత కాలం ఏపీకి పారిశ్రామిక వేత్తలు క్యూ కడతారు. దీనిని భరించలేక వైసీపీ నెగటివ్ ప్రచారాన్ని మొద లుపెట్టింది పెట్టుబడులు అంటే విముఖత చూపిస్తున్నట్టుగా దుష్ప్ర చారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆవిష్కరణలు, నైపుణ్యాలకు పదును పెడుతున్నాం
ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించాం. ఏపీ బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చాం. భారత్లో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతి క్వాంటం వ్యాలీకి అడ్రస్గా మారుతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా ఎంఎస్ ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని 5 జోన్లలో ఆవిష్కరణలకు, నైపుణ్యాలకు పదు ను పెడుతున్నాం. గత ప్రభుత్వంలో ఎవరికీ నైపుణ్యాలను కల్పించ లేక పోయారు. మా ప్రభుత్వంలో మానవ వనరులను అభివృద్ధి చేయటంతో పాటు అత్యుత్తమ ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని ప్రకటించారు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి భూమి చూపించలేదు
దేశంలోనే తొలిసారి ప్రజలందరికీ వర్తింపచేసేలా యూని వర్స ల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నాం. రూ.2.5 లక్షల వరకూ ఉచితంగా వైద్యసేవలు అందించేలా ఈ విధానం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే వైద్యచికిత్సలు అందేలా చర్యలు చేపడుతు న్నాం. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడు తున్నాం. గత పాలకులు కనీసం వైద్య కళాశాలలకు భూమి కూడా చూపించలేదు. ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీపీపీ అంటే ప్రైవేటు కాదని మరోమారు ప్రజలకు చెబుతున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. అన్ని మెడికల్ కళాశాల ల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయి. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతిఒక్కరి ఆరోగ్యం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నాం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలుగును కాపాడే బాధ్యత తీసుకుంటాం
విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ఏటా రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగులతో సమీక్షించుకుం టున్నాం. గత పాలకుల వల్ల విద్యా రంగం దిగజారి పోయింది. ప్రాథమిక విద్య ఎక్కడైనా మాతృభాషలోనే ఉంటుంది. ప్రపం చానికి తెలివైన యువతను అందించటంతో పాటు తెలుగును కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
ప్రముఖ కంపెనీలతో పర్యాటక ప్రాజెక్టులు అనుసంధానం
అతిథి దేవోభవ అన్నది మన విధానం. దీనిని అనుసరించే పర్యాటక విధానాన్ని రూపొందించాం. ప్రకృతి వనరులకు మన రాష్ట్రంలో కొదవలేదు. భూకేటాయింపులు సహా వివిధ ప్రోత్సా హకాలను ప్రాజెక్టులకు అందిస్తున్నాం. పెద్దఎత్తున ఉపాధి కల్పించేలా పర్యాటక పాలసీకి రూపకల్పన చేశాం. 102 ఎంఓయ్నరీల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చాయి. 3.4 లక్షల మందికి దీని ద్వారా ఉద్యోగా లు వస్తాయి. 7,348 హోటల్ గదుల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చాం. సూర్యలంక బీచ్ను గోవాతో పోటీ పడేలా తీర్చి దిద్దుతాం. అఖండ గోదావరి, పాపికొండలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గండికోట మన దేశపు గ్రాండ్ కాన్యన్. దీనిని కూడా అద్భుతంగా అభివృద్ది చేయాలని నిర్ణ యించాం. ప్రసాద్ స్కీమ్ కింద వివిధ దేవాలయాలను కూడా అభివృద్ధి చేయబోతున్నాం. క్యారవాన్, హోం స్టేలు, టెంట్ సిటీ ల ద్వారా పర్యాటకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో వీటిని అనుసంధానించి పర్యాటక ప్రాజెక్టులు పెద్దఎత్తున తీసుకువస్తున్నామని తెలిపారు.
ఎక్సైజ్లో కుంభకోణానికి పాల్పడ్డారు
గత పాలకుల హయాంలో ఎక్సైజ్లో అతిపెద్ద కుంభకోణం చేశారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీని వేసి విచారణ చేస్తున్నాం. సొంత బ్రాండ్లు తెచ్చి వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మొత్తం పారదర్శకంగా మార్చి అంతర్జాతీయ బ్రాండ్లు తీసుకువచ్చాం. ఎవరు తప్పు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యమే మాకు అత్యంత ప్రాధా న్యం. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సేవించి 30 వేల మంది వరకూ అనారోగ్యాల పాలై మరణించారు. ప్రస్తుతం ఎక్సైజ్ విధానాన్ని ప్రక్షాళన చేశామని ప్రకటించారు.














