- జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం
నిజామాబాద్(చైతన్యరథం): నలభై ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్లో పర్యటిస్తున్న ఆయన వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పసు పు పంటకు నిజామాబాద్ రాజధానిలాంటిదని చెప్పారు. ‘‘నా చేతుల మీదుగా పసుపుబోర్డును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణకు పసుపు బోర్డు కోసం భాజపా ఎంపీలు ఎంతో పోరాడారు. దీంతో తెలంగాణకు పసుపుబోర్డు ఇవ్వడమే కాదు.. దానికి చైర్మన్గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. నిజా మాబాద్ పసుపు పంటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. పసుపు ఒక దివ్య ఔషధం. యాంటీ వైరల్, యాటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్గా పని చేస్తుంది. 2030 నాటికి ఒక బిలియన్ డాలర్ విలువైన పసుపును మనం ఎగుమతి చేయాలి. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ కల్పిస్తాం. ఇక్కడి పసుపు పంటకి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. భారత్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతు లకు మేలు చేయాలని కృషి చేస్తున్నాం’’అని కేంద్ర మంత్రి అమిత్ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్.. రాష్ట్ర మంత్రు లు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఎంపీలు అరవింద్, కె.లక్ష్మణ్, పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.