వైసీపీ పాలనలో ఏపీ గంజాయిమయం
నిర్మూలన కోసమే ప్రత్యేక ‘ఈగల్’ విభాగం
11 వేల ఎకరాల్లో సాగును నియంత్రించాం
ప్రతి జిల్లాలో నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు
ఇప్పటివరకు 40,088 కిలోల స్వాధీనం
ఫిర్యాదులకు 1972 టోల్ ఫ్రీ నెంబర్
పంజాబ్, యూపీ విధానాలపై అధ్యయనం
విశాఖ వేదికగా సమన్వయ సదస్సు నిర్వహిస్తాం
నిదాన్ పోర్టల్లో పేరుంటే కఠిన చర్యలు
అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ పాలనలో ఏపీని గంజాయిమయం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్కుమార్, పళ్లా శ్రీనివాస్ తదితర సభ్యులడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభు త్వంలో ఏపీలో పంటల సాగు కన్నా గంజాయి సాగు, రవాణా ఎక్కువ జరిగిందని వివరి స్తూ కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. 11 వేల ఎకరాల్లో జరుగుతున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకిలించి 100 ఎకరాలకు నియంత్రించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 40,088 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన 564 వాహనాలను సీజ్ చేసిన ట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా, డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక ‘ఈగల్’ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని ఏడు మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్ స్పాట్లను గుర్తించి గంజాయి సాగును అంతమొందించినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో 46 లక్షల గంజాయి మొక్కలను వేళ్లతో సహా తొలగించడమే అందుకు నిదర్శనమన్నారు. గంజాయి సాగుకు అలవాటుపడిన కుటుంబాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 359 కుటుంబాలు ఇపుడు గంజాయికి బదులు ఇతర పంటలను పండిస్తు న్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతు న్నామని చెప్పారు.
లోకేష్ చొరవతో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీలు
హోం, ఈగల్ ఆధ్వర్యంలో అంతర్గత సమన్వయ సమావేశం కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డ్రై గంజాయి, లిక్విడ్ గంజా యి, గ్లూస్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలపై నిఘా పెట్టినట్లు వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసిన విష యాన్ని ప్రస్తావించారు. బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లలో గంజాయి వాడకం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో 44 ప్రభుత్వ, ప్రైవేట్ డీ ఎడిక్షన్ సెంటర్లు ఉన్నాయని, జైళ్లలోనూ డీ ఎడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ మార్గనిర్దేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈగల్ కు గంజాయి, డ్రగ్స్పై సమాచారం అందించవచ్చని చెప్పారు. స్కూళ్లలో ఈగల్ టీంల ఏర్పాటు, వర్క్ షాప్ల నిర్వహణ, సమన్వయ బాధ్యతలో ప్రజలు, ప్రతి ఎమ్మెల్యే భాగ స్వామ్యం కావాలని కోరారు. నేరాల నియంత్రణ తగ్గించడానికే గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీ, ఎడ్రిన్ శాటిలైట్, ప్రత్యామ్నాయాలతో గంజాయి సాగు అరికడుతున్నామని వివరించారు.
గంజాయితో దొరికితే ఇకపై అంతే
కేంద్ర మంత్రిత్వ శాఖ నిదాన్ పోర్టల్లో ఉన్న చాలా కఠినమైన నియమ, నిబంధ నలు హోంమంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటా బేస్ అండ్ అరెస్టెడ్ నార్కోటిక్స్ అఫెండర్స్ పోర్టల్లో ఒకసారి పేరు చేరితే పాస్పోర్ట్ రాకపోవడం, ఆస్తులు జప్తు ఖాయమని స్పష్టం చేశారు. ఒక్కసారి గంజాయి కేసులో దొరికితే సమాజం నుంచి మనిషిని వెలివేసినట్లు కఠిన చట్టాలు రూపొందించారన్నారు. గంజాయి ఎంత ప్రమాదకరమో రూపొందించిన చట్టాల ద్వారా ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలన్నారు. ఏపీలో గంజాయిలో పట్టుబడిన గత 25 కేసులలో 20 ఏళ్లకు పైన శిక్షను అమలు చేసి న విషయాన్ని వివరించారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాలలోని కేసుల్లో ఆస్తులను సైతం జప్తు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్డీపీసీ యాక్ట్ చాప్టర్ 5(ఎ) ప్రకారం ఆస్తుల జప్తు చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి ఉత్పత్తి, తయారీ, కొనుగో లు, నిల్వ, ఎగుమతి, దిగుమతి, రవాణా, సాగు, ప్రేరేపించడం, అనుమతించడం అన్నీ నేరమేనని వెల్లడిరచారు.
గంజాయి సాగును అరికట్టడంలో పంజాబ్, యూపీ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా ఉన్నాయని వివరిస్తూ ఇప్పటికే ఓ టీంను అధ్యయనం కోసం పంజాబ్ పంపుతున్నట్లు తెలిపారు. ఏపీ సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో విశాఖ వేదికగా సమన్వయ సదస్సును త్వరలో నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. హోంమంత్రి అనిత సమాధానానికి ముందు డ్రగ్స్ వాడకంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పలు అంశాలను శాసనసభ దృష్టికి తీసుకువచ్చా రు. గంజాయి, మాదకద్రవ్యాలు, పెయిన్ కిల్లర్ల రూపంలో దొరుకుతున్న డ్రగ్స్ వాడకం గురించి మరో ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి (కడప) స్పందించారు. మెడికల్ షాపు లు, కొరియర్ సర్వీసులపై నిఘాపెట్టాలని ఆమె హోంమంత్రిని కోరారు. గంజాయి సాగును కూటమి ప్రభుత్వం తగ్గించడంపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అభినందించారు. డ్రగ్స్ రూపం మార్చుకుని సమాజంలోకి వస్తుండడం పట్ల అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. యూపీ ప్రభుత్వం తరహాలో గంజాయి సాగు, రవాణా ను ప్రోత్సహిస్తే ఇల్లు కూలగొట్టాలని మరో ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (గాజువాక) కోరారు. డబ్బు కోసం సమాజాన్ని పెడదారిన పెడుతున్న గంజాయి కొరియర్లపై కఠిన చట్టాలు అమలు చేయాలని సూచించారు.