- వారిని అన్ని విధాలా మోసగించారు
- నేరాలు ఘోరాల్లో ఏపీని ముందు నిలిపారు
- సున్నా వడ్డీని కుదించి దగా చేశారు
- పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎగ్గొట్టారు
- ఉపయోగపడే పథకాలను రద్దు చేశారు
- గత పాలనంతా దోచుకుని దాచుకోవడమే
- మహిళా సంకేమానికి చంద్రబాబు కృషి
- వారి కోసం ఎన్నో మంచి పనులు చేశారు
- మాజీ మంత్రి పీతల సుజాత
మంగళగిరి(చైత్యరథం): వైసీపీ నేతలు గత పాలనలో మహిళలు ఉన్నారన్న సంగతే మరచి మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా నేడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అనేక మహిళా పథకాలను రద్దు చేయటమే కాకుండా, మహిళలపై ఎన్నో నేరాలు ఘోరాలు జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.3,22,359 కోట్లతో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుం ది. మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు చేయడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు సామాజికంగా, ఆర్థికం గా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించేలా చంద్రబాబు నిత్యం ఆలో చిస్తుంటారు. చంద్రబాబు మహిళా పక్షపాతి.. వారి మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహిళా శిశు సంక్షేమానికి రూ.4,332 కోట్లు బడ్జెట్లో కేటాయించడమే ఇందుకు నిదర్శనం. మహిళల తరపున ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత లు చెబుతున్నాం. పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పించి ఆన్న నందమూరి తారకరామారావు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచితే దాన్ని కొనసాగిస్తూ మహిళలు వారి కాళ్లమీద వారు నిలబడేలా డ్వాక్రా గ్రూపులను తీసుకు వచ్చి ఘనత చంద్రబాబుదని స్పష్టం చేశారు. మహిళల పేరు మీద ఇళ్లపట్టాలు ఇవ్వడం, మహిళలకు కండక్టర్ జాబులు ఇవ్వడం, మహిళల పేరు మీద ప్రభుత్వ కార్డులు ఇవ్వడం వంటి గొప్ప నిర్ణయా లు తీసుకుని మహిళలకు సరైన గుర్తింపునిచ్చారని పేర్కొన్నారు.
మహిళలను మోసగించిన జగన్రెడ్డి
ఈ బడ్జెట్ మహిళా సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది… మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గత వైసీపీ పాలన అంతా దోచుకోవడం దాచుకోవడమే. తల్లిని చెల్లిని కూడా గెంటేసిన వ్యక్తికి బయటి మహిళలను అక్కా చెల్లి అంటూ పిలిచే అర్హత ఎక్కడిది? అని ప్రశ్నిం చారు. ఉచిత ఇళ్ల పేరుతో మహిళలను మోసం చేశారు. ఓటీఎస్ అంటూ రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు దండుకున్నారు. సెంటు పట్టా పేరుతో పేదలను వంచిం చారు. టీడీపీ పాలనలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశా రు. టీడీపీ పాలనలో అమలైన పెళ్లి కానుకను రద్దు చేశారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా ఇబ్బంది పెట్టారు. గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం అమ్మకాలతో దోపీ డీకి తెరలేపారు. మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. సున్నా వడ్డీని ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి మూడు లక్షలకు కుదించాడు. ఆ వడ్డీని కూడా ఆయన కట్టలేదు కేంద్రమే భరించింది. జగన్రెడ్డి డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం నిధులు రూ. 2100 కోట్లను దారి మళ్లించి డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారు. మళ్లీ వీళ్లకు డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
పేదలు, మహిళల కడుపుకొట్టిన పాపం జగన్రెడ్డిదే
అమ్మఒడి రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డితో దాదాపు రూ.70 వేలు దండుకున్నారు. మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహిస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. బాలికలకు బడికొస్తా పథకంలో భాగంగా అమలు చేసిన సైకిళ్ల పంపిణీని పక్కన పెట్టారు. గవర్న మెంట్ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. గిరిజన ప్రాంతాల్లో మహిళల కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్లను ఆపేశారు. గిరిజన గర్బిణుల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాలను మూసేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను అటకెక్కించారు. పండుగలకు పేదలకు ఇచ్చే రంజన్, క్రిస్మస్, సంక్రాంతి కానుక లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. దిశ పేరుతో డ్రామాలు ఆడారే తప్ప జగన్ పాలనలో ఆడబిడ్డకు రక్షణగా నిలిచే ఒక్క రక్షణ వ్యవస్థ కూడా లేదు. కూట మి ప్రభుత్వం వచ్చాక చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వివరించారు.
మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దుతున్నాం
వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తీసుకు వచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్ పాలనలో కుదించిన సున్నా వడ్డీ పరిమితి మూడు లక్షల నుండి మళ్లీ దాన్ని ఐదు లక్షలకు పెంచుతున్నాం. ఒక్కో సభ్యురాలికి 50 వేల నుంచి లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాం. వడ్డీ రాయితీ రుణాలను త్వరలో పది లక్షల వరకు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిదేందుకు వారికి పెట్టిబడి రాయితీని 35శాతం నుంచి 40శాతం పెంచాం. ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లించేందుకు బడ్జెట్లో రూ.60 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయం. గత ఐదేళ్ల పాలనలో అక్రమాలు అవినీతే..అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.తమకు అధికారం ఇచ్చారు. వారి ఆశలు ఆశయాలను నెరవేరుస్తూ ఒక్కొక్క హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు. పాఠశాలలు ప్రారం భమైన వెంటనే తల్లికి వందనం అమలు చేస్తాం. తల్లికి వందనంపై వైసీపీ పేటీఎం బ్యాచ్ దారుణంగా ట్రోల్ చేశారు. అర్హత ఉంటే వైసీపీ పేటీఎం బ్యాచ్కు కూడా రూ.15 వేలు ఇస్తాం. ఇది ప్రజల ప్రభుత్వం..ప్రజా పాలన నడుస్తుంది.. ప్రజలు సంతోషంగా ఉండటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.