- వైసీపీని కూకటివేళ్లతో పెకలించిన రోజు జూన్ 4
- గత ఐదేళ్లు హామీలు అమలు చేయకుండా పోట్లు
- ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నాం
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
- రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభం
కొండపి(తూర్పునాయుడుపాలెం(చైతన్యరథం): గత ఐదేళ్లు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన జగన్ నేడు వెన్నుపోటు దినోత్సవం పేరుతో నిరసనలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ఉదయం కొండపి నియోజకవర్గం టం గుటూరు మండలం తూర్పునాయుడుపాలెం, కొండపి మండలం కె.ఉప్పాలపాడులో రేషన్షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి ప్రారంభించారు. అనం తరం సభలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనను ప్రజలు కూకటివేళ్లతో పెకలించిన రోజు జూన్ 4.. ప్రజా తీర్పును వెన్నుపోటు అనడం సిగ్గుచేటు. గత ఐదేళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగనేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అం డగా ఉంటుందని మంత్రి తెలిపారు.
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఆదిమూలపు సురేష్
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన వైసీపీ నేతలు నేడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ నిధులు దోచుకోవడం తప్ప విద్యారంగానికి మీరు చేసింది ఏమిటి? ఏపీపీఎస్సీలో అక్రమాలకు పాల్పడి వేలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుంది జగన్ కాదా? అని ప్రశ్నించారు. లోకేష్ను విమర్శించే స్థాయి ఆదిమూలపు సురేష్కు లేదన్నారు. సురేష్ ఏ శాఖ బాధ్యతలు చేపట్టినా అంతా అవినీతే.. లోకేష్ మంత్రిగా విద్యా వ్యవస్థలో విప్లవా త్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా లోకేశ్ తీర్చిదిద్దుతున్నారు. వైసీపీ నేతలు ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.
పారదర్శకంగా రేషన్ పంపిణీకి శ్రీకారం
రేషన్ పంపిణీలో పేదలకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా రేషన్ అందించ దమే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 6,61,206 కార్డులు ఉన్నాయన్నారు. కొండపి నియోజక వర్గంలో 92,257 కార్డులు ఉన్నాయని, ఈ గ్రామంలో 617 మంది కార్డుదారులు ఉన్నట్లు వివరించారు. ఈ ఒక్క సంవత్సరంలోనే తూర్పునాయుడుపాలెం గ్రామంలో రూ.14 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తూర్పునా యుడుపాలెం ఎస్సీ కాలనీ, ఓల్డ్ ఎస్సీ కాలనీలో రూ.2 కోట్లతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లకు, సైడు కాలువలకు మంత్రి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు.