- ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
- రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సాయం కోరిన సీఎం
- జల్ జీవన్ మిషన్పై సీఆర్ పాటిల్తో భేటీ
- బనకచర్ల ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించిన వైనం
- అటల్ భూజల్ యోజనపైనా సుదీర్ఘ చర్చ
- మేఘావాల్తో కర్నూలు హైకోర్టు బెంచ్పై భేటీ
- రాష్ట్ర ఆక్వా పరిస్థితిపై పియూష్తో సమావేశం
- రాష్ట్రాభివృద్ధికి సహకరించాలంటూ షాతో భేటీ
ఢిల్లీ (చైతన్య రథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢల్లీిలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఢల్లీి చేరుకున్న సీఎం చంద్రబాబు… నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయిన చంద్రబాబు.. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై చర్చించారు. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ను రాష్ట్రంలో విస్తృతస్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి…. ఈ పథకానికి నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అదేవిధంగా రాష్ట్రాన్ని కరవురహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుపైనా కేంద్ర జలశక్తి మంత్రికి వివరించి… ప్రాజెక్టుకు సాయం చేయాలని కోరారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.
అదేవిధంగా కేంద్ర అటల్ భూజల్ యోజన్ కార్యక్రమంపై భేటీలో చర్చించారు. భూగర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సీపం… ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కర్నూలులో హై కోర్టు బెంచ్ అంశంపై ఆయనతో చర్చించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన సీఎం చంద్రబాబు… అమెరికా సుంకాల కారణంగా రాష్ట్రంలో ఆక్వారంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. భారతదేశ సీ ఫుడ్స్పై విధించిన 26 శాతం సుంకాలు ఏపీలోని ఆక్వా రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని సీఎం వివరించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. దీని కోసం తీసుకోవాల్సిన స్వల్పకాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యల గురించి పలు ప్రతిపాదనలు సూచించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ భేటీలలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు.