చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చెట్టు ఫొటోతో ఓటు!.. అపహాస్యంగా ఓటర్ల జాబితాల ప్రక్రియ: అచ్చెన్నాయుడు

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతల ఫిర్యాదు

by చైతన్యరధం
Nov 9, 2023 at 3:46pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చెట్టు ఫొటోతో ఓటు!.. అపహాస్యంగా ఓటర్ల జాబితాల ప్రక్రియ: అచ్చెన్నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీకి అంతిమ ఘడియలు
  • ప్రజాగ్రహాన్ని పసిగట్టే ఓటర్ల జాబితాల్లో జగన్‌రెడ్డి అక్రమాలు
  • ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కలెక్టర్లు, కిందిస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు
  • ప్రతిపక్షాలు.. ప్రజల విజ్ఞప్తుల్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నారు
  • తప్పులు చేస్తున్న సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • రాష్ట్రంలోని పరిస్థితుల్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం

అమరావతి: రాష్ట్ర ప్రజలు తమపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పసిగట్టిన జగన్‌ రెడ్డి, అతని ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు సృష్టించడం.. అర్హుల ఓట్లు తొలగించడం అనే తంతుని నిరంతరం కొనసాగిస్తున్నారని, ప్రత్యేకంగా దొంగ ఓట్ల కోసమే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను జగన్‌రెడ్డి ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోందని విమర్శించారు.

టీడీపీ నేతలతో కలిసి, రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాలపై అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంఏ.షరీఫ్‌, వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తదితరులు ఉన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయులు.. కొందరు ప్రభుత్వాధికారులు ఎన్నికల వ్యవస్థలో కీలకంగా పనిచేసేవారన్నారు. కానీ జగన్‌రెడ్డి ఒక దుర్బుద్ధితో వాలంటీర్‌.. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వ్యవస్థలు ఎన్నికల ప్రక్రియలో వేలు పెట్టడం.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం రివాజుగా మారింది. ఈమాట మేం అనడంలేదు.. అన్ని పార్టీలు.. ప్రజలు అంటున్నారు. మీడియాలో వచ్చే కథనాలు కూడా ప్రజల అభిప్రాయాన్ని ధృవీకరిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు.

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఒక చెట్టు పేరుతో ఓటర్ల జాబితాలో ఓటు సృష్టించారు. ఒక్కో వ్యక్తికి మూడు, నాలుగుచోట్ల దొంగ ఓట్లు కల్పించారు. సాధారణ వ్యక్తులకు కాదు.. ఏకంగా ప్రభుత్వపెద్దలు, మంత్రులుగా ఉన్నవారికే రెండు మూడు చోట్ల ఓట్లు న్నాయి. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు నెల్లూరులోని మూడు ప్రాంతాల్లో ఓట్లున్నాయి. అనిల్‌ కుమార్‌ ఎవరో ఈ ప్రభుత్వానికి.. అధికారులకు తెలియదా? ఇలాంటి అనైతిక పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం దొంగ ఓట్లతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

ప్రతిపక్షాల విజ్ఞప్తులు.. ఎన్నికల సంఘం ఆదేశాలను బుట్ట దాఖలు చేస్తున్నారు

ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో జరిగే తప్పు లు.. ఓటర్ల జాబితాకు సంబంధించిన తప్పుల్ని స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు స్పందించకపోతే ఎప్పుడు వీలైతే అప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలుస్తున్నాం. కానీ పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను జిల్లా కలెక్టర్లు బుట్టదాఖలు చేస్తున్నారు. దొంగ ఓట్లు.. అర్హులైన ఓట్లు తీసేసిన దానికి సంబంధించి ఆధారాలతో సహా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నావారు స్పందించడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

పెండిరగ్‌ దరఖాస్తులు పరిష్కరించకుండానే..

కొత్త ఓటర్ల చేర్పులు.. చనిపోయినవారి ఓట్లు తొలగించడం..అదే విధంగా ఓటర్ల జాబితాను సరిచేయడం అనేది ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకం. గతంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్‌ చేసినప్పుడు, పైన చెప్పిన మూడు అంశాలకు సంబంధించి అధికారులు.. బీఎల్వోలు ఓటర్ల నుంచి సమాచారం సేకరించారు. కానీ గత నెలలో ఎన్నికలకమిషన్‌ విడుదలచేసిన ముసా యిదా ఓటర్‌ లిస్ట్‌ చూశాక ఓటర్ల నుంచి బీఎల్వోలు సమాచారంపై క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమైంది. ఫామ్‌-6, ఫామ్‌-7, ఫామ్‌-8ల వివరాలు ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్లో కనిపిస్తున్నాయి గానీ, ముసాయిదా ఓటర్ల జాబితాలో వాటికి సంబంధించిన మార్పుచేర్పులు కనిపించడం లేదు. కొత్త ఓటర్ల చేర్పులకు సంబంధించి 2లక్షల 9వేల ఫామ్‌-6 లు దరఖాస్తు చేస్తే, ఆ వివరాలు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్లో నమోదయ్యాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన ఓటర్ల చేర్పుల ప్రక్రియ జరగలేదు. అలానే ఫామ్‌ -7ల దరఖాస్తులు 5.58లక్షలు ఇచ్చాం. ఓటర్ల జాబితాలో సవరణలు సూచిస్తూ ఫామ్‌-8 దరఖాస్తులు 7.16లక్షల వరకు ఎన్నికల కమిషన్‌కు అందించాం. అవన్నీ ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్లో కనిపిస్తు న్నాయి.. కానీ ఆయా దరఖాస్తు సమాచారాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్ట్‌ చూశాక అర్థమైంది. మేము ఇచ్చిన దరఖాస్తులపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. పరిగణనలోకి తీసుకున్నామని.. లేదని.. ఇతర కారణాలు ఏమీ చెప్పలేదు? గతంలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కరించకుండా మరలా కొత్తగా ఇంటింటికీ వెళ్లి ఫామ్‌-6, ఫామ్‌-7, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫామ్‌-6, ఫామ్‌-7 వంటి దరఖాస్తులన్నీ కలిపి ఇప్పటికే 11లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా మరలా వివరాలు అడగడం సరికాదని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చెప్పామని అచ్చెన్నాయుడు తెలిపారు.

కింది స్థాయి అధికారులు.. సహకరిస్తున్న కలెక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలి

నియోజకవర్గాల వారీగా నమోదైన దొంగఓట్లు.. అర్హుల ఓట్ల తొలగింపు వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముందు ఉంచాం. కానీ క్షేత్ర స్థాయిలో తప్పుచేసిన అధికారులు..ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలు సరిగాలేవు. స్థానిక ఎమ్మెల్యే ల ప్రోద్బలంతోనే పోలింగ్‌ కేంద్రాలు మార్చడం లేదు. దానిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పాం.  మొక్కుబడిగా ఒకరినో ఇద్దరినో సస్పెండ్‌ చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదని.. సీరియస్‌గా వ్యవహరించాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరాం. మా విజ్ఞప్తులపై ఆయన స్పందించారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఒక్కరోజే 13 లేఖలు అందించాం. గతంలో కూడా పలుమార్లు అనేక ఫిర్యాదులు చేశాం. ఇదే విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో కూడా చెప్పాం. అధికారులు మీ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. వైసీపీ నేతల కనుసన్నల్లోనే అధికారులు, కొందరు కలెక్టర్లు పనిచేస్తున్నారని నిర్మొహమాటంగా చెప్పాం. ఈ విషయాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు.

త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుంచిన అన్ని వివరాలను..ఫిర్యాదుల్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ముందు కూడా ఉంచుతాం. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు..దొంగ ఓట్ల వ్యవహారం..ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతర అంశాలపై త్వరలోనే టీడీపీ ఎంపీలతో కలిసి సీఈసీకి ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా,ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలన్నదే టీడీపీ అభిమతం. ఎందరు అధికారులపై..ఇతర సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసు కున్నారో పోలీస్‌ శాఖ నుంచి వివరాలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చెప్పాం. దానికి ఆయన కూడా సరేనన్నారు. వైసీపీలోని పెద్ద పెద్ద నాయకులే సిగ్గులేకుండా దొంగఓట్లు చేర్పిస్తున్నారు. బూత్‌ల వారీగా త్వరలోనే ఆ సమాచారం కూడా ఎన్నికల సంఘం ముందు ఉంచుతామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

 

అధికారుల్ని ప్రశ్నిస్తుంటే వెటకారంగా మాట్లాడుతున్నారు: బొండా ఉమా

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ అనేది రాష్ట్రంలో అపహాస్యంగా  మారిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్వోలు.. కలెక్టర్లు చుట్టూ తిరగడమే ప్రతిపక్షాల పని అయిపోయింది. కలెక్టర్లు..కిందిస్థాయి సిబ్బంది ఫామ్‌-7 దరఖాస్తుల విషయంలో తాడేపల్లి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు.ఫామ్‌-7 దరఖాస్తుల విషయంలో టీడీపీ ఓట్లు తొలగించే విషయంలో అధికారులు పోటీలు పడి పనిచేస్తున్నారు. వారికి వాలంటీర్లు.. సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారు. అనర్హుల ఓట్లు తీసేయమని టీడీపీ ఇచ్చే దరఖాస్తులపై మాత్రం తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం (నియోజకవర్గం నెం-80)లో పోలింగ్‌ స్టేషన్‌ నెం-62 లో ఒక వైసీపీ నాయకుడి తల్లిపేరుతో మూడు ఓట్లు నమోదు చేశారు. ఒకే వ్యక్తికి…ఒకే ఫోటోతో ఒకే పోలింగ్‌ స్టేషన్లో అధికారుల ప్రమేయం లేకుండా మూడు ఓట్లు ఎలా నమోదవుతాయి? అవి ఎందుకు తీసేయరని మేం స్థానిక అధికారుల్ని ప్రశ్నిస్తే రూల్స్‌ ప్రకారం స్పందిస్తామని చెబుతున్నారు. అవే రూల్స్‌.. ఇతర నిబంధనలు దొంగఓట్లు తీసేయడంలో ఎందుకు చూపించటం లేదని బొండా ప్రశ్నించారు.

నగరపాలక అధికారులు, మున్సిపల్‌ అధికారుల వద్ద పౌరుల జననమరణాల వివరాలు ఉంటాయి. వాటి ప్రకారం ఎవరు చనిపోయారో ఓట్లు తొలగించే ముందు అధికారులు ఎందుకు పరిశీలించలేదు మరీదారుణంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ స్టేషన్‌-44లో ఒక చెట్టుని ఓటరుగా చూపారు. అధికారపార్టీకి నచ్చితే చెట్టుకు.. పుట్టకు… ఆఖరికి చెప్పు లకు కూడా ఓట్లు పుట్టిస్తారు. టీడీపీ వాళ్లు దొంగ ఓట్లు తీసేయమంటే నిబంధనలు అంటున్న అధికారులకు ఇలాంటి వింతలు కనిపించడం లేదా అని బొండా నిలదీశారు. అధికారులు.. కొందరు కిందిస్థాయి సిబ్బంది పని తీరుతో ఇంతకు ముందు జరిగిన ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన అంతా ప్రహసనంగా మారింది. 2019 ఎన్నికల్లో 25ఓట్లతో ఓడిపోయాను. ఇప్పు డు నానియోజకవర్గంలో 12,000 దొంగఓట్లు చేర్చారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరని అధికారుల్ని ప్రశ్నిస్తుంటే.. వెటకారంగా సమాధానమిస్తున్నారు. ఆధారా లు చూపిస్తున్నా.. పట్టించుకోని వారిని ఏం చేయాలో మీరే ఆలోచించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించాం. ఈ ప్రభుత్వ కుట్రలు.. కుతంత్రాలను అమలుకానివ్వం. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.. అలానే దొంగ ఓటు ఒక్కటీ ఉండకూడదన్నదే టీడీపీ లక్ష్యం. ఓటమి భయంతోనే జగన్‌రెడ్డి అధికారుల్ని అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో ఇలాంటి అవక తవకలకు పాల్పడుతున్నాడని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: ఎంఏ.షరీఫ్‌ఎమ్మెల్సీ అశోక్‌ బాబుకింజరాపు అచ్చెన్నాయుడుదొంగ ఓట్లుపిల్లి మాణిక్యరావుబొండా ఉమామహేశ్వరరావువర్ల రామయ్యసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Previous Post

టిడిపి – జనసేన సమన్వయ కమిటీ సమావేశం

Next Post

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-05-2025

కార్యకర్త
@ May 21, 2025
చైతన్యరధం ఈ పేపర్ 20-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-05-2025

కార్యకర్త
@ May 20, 2025
చైతన్యరధం ఈ పేపర్ 19-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2025

కార్యకర్త
@ May 19, 2025
ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025

కార్యకర్త
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist