- స్టేడియం పునరుద్ధరణ పనుల శిలాఫలకం ఆవిష్కరణ
విశాఖపట్నం (చైతన్యరథం): ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్కు హాజరయ్యారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్-ఢల్లీి క్యాపిటల్స్ జట్ల మ్యాచ్ను ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి మంత్రి లోకేష్ వీక్షించారు. అంతకుముందు విశాఖ క్రికెట్ స్టేడియానికి చేరుకున్న మంత్రి లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఇతర సభ్యులు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని శాలువాతో సత్కరించి మొమెంటో బహూకరించారు.
అనంతరం స్టేడియం పునరుద్ధరణ, ఆధునికీకరణను పురస్కరించుకుని ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నితో కలిసి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్, ఇతర ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
అంతకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
`