- ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ
- లక్షల కుటుంబాల్లో వెలిగిన ఆశల దీపం
- పిల్లల చదువుకు, భవిష్యత్కు భరోసా
- చంద్రన్నకు తల్లుల కృతజ్ఞతలు
- జగన్ రెడ్డి వెటకారాలకు చెంపపెట్టు
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ ప్రధాన హామీ తల్లికి వందనం అమల్లోకి రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖాతాల్లో డబ్బులు పడ్డట్లుగా ఫోన్లో మెసేజ్ టింగ్మనగానే తల్లుల తన్మయం తారాస్థాయికి చేరింది. దా దా తల్లి ఇటురా.. నీకు పదహైదు వేలు, నీకు పదహైదు వేలు.. అందాయా తల్లీ..అంటూ ఇన్నాళ్లూ వెటకారంగా మాట్లాడిన జగన్రెడ్డికి, వైసీపీ నేతలకు చెప్పుతో కొట్టినట్లు, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గురువారం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లోకి తెచ్చారు. శుక్రవారం నుంచీ తల్లుల ఖాతాల్లో డబ్బుల జమ మొదలయింది. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థుల చదువుల కోసం వారి తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నగదు జమ అవుతోంది. అమ్మఒడి పేరుతో ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి రూ.15,000 ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఒక్కరికే పరిమితం చేసి మోసం చేసిన జగన్రెడ్డికి చెంపపెట్టులా ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం నిధులను కూటమి ప్రభుత్వం జమచేస్తోంది. ప్రస్తుతం రెండో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకు.. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో నగదు జమవుతోంది. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి ఏడాదిలో పిల్లలు చేరిన తర్వాత వారి తల్లుల అకౌంట్లలో కూడా నిధులు జమచేస్తారు.
జగన్ జమానాలో అమ్మఒడి పథకం కేవలం 42 లక్షల మందికే ఇచ్చారు. నేడు రాష్ట్రంలో స్కూలుకు వెళ్లే పిల్లలు ఇంటికి ఒక్కరే ఉన్న మహిళలు 18.55 లక్షల మంది. ఇద్దరు ఉన్న మహిళలు 14.55 లక్షలు. ముగ్గురు ఉన్న వారు 2.1 లక్షలు. నలుగురు ఉన్న వారు 20 వేల మంది. అంటే 17 లక్షలకు పైగా కుటుంబాలకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు డబ్బు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ 17 లక్షల కుటుంబాలు కాకుండా మరో 18 లక్షల కుటుంబాలకి గత ప్రభుత్వంతో సమానంగా ఇస్తోంది.
నలుగురు పిల్లలు ఉన్న ఒక అమ్మకు తల్లికి వందనం కింద చంద్రన్న రూ.52 వేలు పంపించాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ళలో వేసిన డబ్బు, చంద్రబాబు ఒక్క ఏడాదిలో వేసారు.. మా కుటుంబానికి ఒక్కసారిగా రూ.52 వేలు వచ్చాయని ఆమె ఆనందంతో తబ్బిబ్బవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద 52 వేల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలో వేసింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ.. సదరు కుటుంబం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గతంలో వైసీపీ హయాంలో తమకు ఒక్క చిన్నారికి మాత్రమే అమ్మ ఒడి పడిరదని.. ఇప్పుడు నలుగురికి తల్లికి వందనం అందిందని ఆ కుటుంబం పేర్కొంది. చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు చేసిన సాయంతో తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటామన్నారు. ఇదే విధంగా ముగ్గురు పిల్లలున్న తల్లుల ఖాతాలో రూ.39 వేలు జమయ్యాయి. ఇద్దరు పిల్లలుంటే రూ.26 వేలు, ఒక్కరే ఉంటే రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ కావటంతో ఫోన్లకు వచ్చిన మెసేజ్లు చూసుకుని వారు మురిసిపోతున్నారు.
నగదు జమయిందని ఫోన్కు సందేశం వచ్చినప్పుడు లక్షలాది తల్లులు దీనిని తమ బిడ్డ చదువులకు, భవిష్యత్తుకు తొలి అడుగుగా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతా పూర్వకంగా మనసులోనే నమస్కరించుకుంటున్నారు. కొందరైతే చంద్రబాబు చిత్రపటానికి బహిరంగంగానే మొక్కుతున్నారు. ఇది లక్షలాది కుటుంబాల్లో ఆశల దీపం వెలిగించిన మహత్తర పథకం.
లక్షలాది తల్లుల ఆనందాన్ని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్న జగన్ రెడ్డి ఈ పథకం గురించి అప్పుడే దుష్ప్రచారం ప్రారంభించారు. ఈ పధకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయంటూ జగన్, వైసీపీ మూకలు తప్పుడు ఆరోపణలు ప్రారంభించారు. వారందరికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గట్టి హెచ్చరిక చేశారు. 24 గంటలు సమయం ఇస్తున్నా.. ఆరోపణలు నిరూపించండి..లేదా వాటిని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పండి.. లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి.. అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛను రూ. 1000 పెంచడానికి దఫదఫాలుగా పెంచుతూ ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. దాని గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా ఒకేసారి రూ.1000 పెంచి రూ.4,000 పింఛన్ అందించారు. అప్పుడే జగన్రెడ్డికి చంద్రబాబు అనుభవం, సమర్థత గురించి అవగాహన వచ్చి ఉండాలి. కానీ తాము వదిలి వెళ్లిన అప్పుల భారంతో కుంగిపోతున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయలేదనే ధైర్యంతో అవహేళనగా మాట్లాడిన జగన్, ఆయన బ్యాచ్కి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పారు.
అభివృద్ధి, శాంతి భద్రతలు లేకుండా కేవలం బటన్ నొక్కడం ఒక్కటే తెలిసిన జగన్ రెడ్డి ఎక్కడా… రాజధాని అమరావతి, పోలవరం, ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్లను పరుగులు తీయిస్తూ సంక్షేమ పథకాల్లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న చంద్రబాబు ఎక్కడా? నక్కకూ..నాగలోకానికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది.