- కారుతో తొక్కించి..మానవత్వం కూడా లేదు
- చేసిన తప్పు ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకోండి
- తల్లి, చెల్లి ఫోన్లనూ ట్యాప్ చేయించిన ద్రోహి
- ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం
- ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): సింగయ్య మృతికి తాను కారణం కాదని ప్రెస్మీట్ పేట్టి చెప్పే ధైర్యం జగన్రెడ్డికి ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. జగన్ కారు కింద సింగయ్య పడి నలిగిపోతున్నా పట్టిం చుకోకుండా ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయిన వైసీపీ నేతలు ప్రజా స్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? తల్లి, చెల్లి ఫోన్లను కూడా ట్యాప్ చేయించి దొంగ చెవులతో విన్న వ్యక్తులు ప్రజాస్వా మ్యం గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తులే.. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించేది కేంద్రం. అది వైసీపీ నేతలకు తెలియదు. ఇది తెలియ కుండా జగన్కు భద్రతపై వైసీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారు. భద్రత విషయంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత ప్రోటోకాల్ ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం అది కల్పిస్తుంది. నిబంధనలు తుంగలో తొక్కి సింగయ్య ప్రాణాలు పోవడానికి కారణమై కూడా నిజం కళ్ల ముందు కనిపిస్తున్నా వైసీపీ నేతలు నిజాన్ని పక్కదారి పట్టిస్తూ విషప్రచారం చేస్తున్నారు. సింగయ్యను చంపింది కాక కల్పిత కథ లంటూ అబద్ధాలతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. మానవత్వం ఉన్న ఎవరైనా సింగయ్యను ముళ్లపొదల్లో పడేసి వెళతారా? జగన్ వెనక అన్ని కార్లు ఉన్నా ఏ ఒక్క దానిలో అయినా ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లకూడదా? తప్పు ఒప్పుకోకుండా సమర్థించు కుంటున్న వైసీపీ నేతలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నవ్విపోతున్నారు
నాడు వివేకా చావును ముందు గుండెపోటు అన్నారు.. మధ్యా హ్నానికి మర్డర్ అని ప్రచారం చేశారు.. సాయంత్రానికి నారాసుర రక్తచరిత్ర అని అబద్ధాలు ప్రచారం చేశారు. అసలు హంతకులు తెలిసే సరికి ఆ హంతకులను జగన్రెడ్డి రక్షిస్తున్నాడు. చంద్రబాబు కుప్పం పోయినప్పుడు అడ్డుకున్నారు. విశాఖ ఎయిర్పోర్డులో అడ్డు కున్నారు. అనపర్తి పర్యటనలో లారీలను అడ్డంపెట్టి అడ్డుకున్నా రు. మాచర్లలో టీడీపీ కార్యకర్త పరామర్శకు వెళుతుంటే.. చం ద్రబాబు నివాసానికి తాళ్లుకట్టారు. జోగి రమేష్ వైసీపీ మూకలతో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చాడు. చంద్రబాబు అంగళ్ల పర్యట నలో పెద్దిరెడ్డి కనుసన్నల్లో దాడులు చేశారు. అది మాకు సంబం ధం లేకపోయినా హత్యాయత్నం కేసులు పెట్టి హింసించారు. లోకేష్ పర్యటనను అడ్డుకుంటూ నానా ఇబ్బందులు పెట్టారు. ఈ సంఘటనలు ఎవరూ మరచిపోలేదు జగన్రెడ్డి. ఇలాంటి మీరు ప్రజాస్వామ్యం గురించి.. హక్కుల గురించి మాట్లాడుతుంటే అంద రూ సిగ్గుతో తలవంచుకుంటున్నారు. జగన్ నోటి నుంచి ప్రజాస్వా మ్యమంటూ మాటలొస్తుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు.. ఇప్పటికైనా వైసీపీ మూకలు సింగయ్య మృతిపై నిజాన్ని అంగీకరించాలని హితవుపలికారు.